ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వెర్లను దొంగిలిస్తున్న ముఠా అరెస్టు
Updated on: 2024-12-18 16:05:00
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆదేశాలు మేరకు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్,భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ విల్సన్ల స్వీయ పర్యవేక్షణలో ద్వారకాతిరుమల ఎస్సై తన సిబ్బందితో కలసి సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి ద్వారకాతిరుమల,భీమడోలు, లక్కవరం, తడికలపూడి,టి.నరసాపురం పోలీస్ స్టేషన్లో పరిధిలలో దొంగిలించిన మొత్తం 41 ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైర్లను దొంగిలించిన ముగ్గురు నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.వారు ముగ్గురూ సొంత బావా, బావమరుదులు అయినట్లు,ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి వైర్లను దొంగిలించిన తర్వాత జంగారెడ్డిగూడెంలోని ఉక్కుర్తి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన పాత ఇనుప సామాన్ల కొట్టులో అమ్ముకున్నట్లు నిర్ధారించి,సదరు ఉక్కుర్తి వెంకటేశ్వరరావు వద్ద నుండి సుమారు 539 కేజీల కరిగించబడిన రాగి వైర్ల దిమ్మెలను 100 కేజీల రాగి వైర్లను మొత్తం 639.75 కేజీల రాగిని స్వాధీన పరచుకోని,నిందితుల వద్ద దొంగతనానికి ముందు ఎడ్జ్ ఫీజులను తొలగించుటకు ఉపయోగించే ఇనుప కొక్కెం తోడగబడిన ప్లాస్టిక్ పైపు,రెండు ఇనుప రెంచీలు,నిందుతులు నేరం చేయటానికి వాడిన రెండు బైకులు స్వాదీనపర్చు పరుచుకున్నారు వీటి యొక్క విలువ మొత్తం రాగి విలువ: రూ. 6,39,750 /- అని పోలీసులు తెలిపారు.నేరానికి పాల్పడిన ముగ్గురు ముద్దాయిలతోపాటు రాగివైరుకొన్న పాత ఇనప సామాల కొట్టు యజమానినీ పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.