ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ట్రిపుల్ ఐటీ నూజివీడు మెటలర్జీ ఇంజనీరింగ్ విద్యార్థులు ‘కె.సి.పి ఇంజనీర్స్ ప్రై. లిమిటెడ్’ కంపెనీ ఉద్యోగానికి ఎంపిక
Updated on: 2024-12-16 17:00:00
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజిలోని మెటలర్జీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు నీలపు.శ్రీవాణి, ఎన్.క్రాంతికుమారి,కె.హేమలత,కె.మమతాంజలి,వై.మంజుల మద్రాసుకు చెందిన కె.సి.పి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యారు.ఎంపికైన విద్యార్థులందరినీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ అభినందించారు.నేటి విద్యార్థులందరూ సాఫ్ట్ వెర్ ఉద్యోగాల వైపే పరిమితమవడం కాకుండా,కోర్ ఇంజనీరింగ్ బ్రాంచిలలో కూడా మెరుగైన అవకాశాలున్నాయని తెలుసుకోవాలన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా మెటలర్జీ విభాగ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి,ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారని డైరెక్టర్ తెలియజేసారు.ఈ సంవత్సరం వంద శాతం ఉద్యోగాల కల్పనతో మెటలర్జీ విభాగం విద్యార్థులు ముందంజలో ఉన్నదని తెలియజేసారు.దేశానికి మెటలర్జీ విభాగంలో ఉదోగార్థుల కొరత ఉందనీ,ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనీ, విభాగాధిపతి డాక్టర్.బి. వెంకటేశ్వర్లు తెలియజేసారు.జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూడా నూజివీడు మెటలర్జీ విభాగ విద్యార్థులు రాణించి,అవకాశాలను అందిపుచ్చుకుని స్థిరపడ్డారని తెలియజేసారు.