ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ట్రిపుల్ ఐటీ నూజివీడు మెటలర్జీ ఇంజనీరింగ్ విద్యార్థులు ‘కె.సి.పి ఇంజనీర్స్ ప్రై. లిమిటెడ్’ కంపెనీ ఉద్యోగానికి ఎంపిక
Updated on: 2024-12-16 17:00:00
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజిలోని మెటలర్జీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు నీలపు.శ్రీవాణి, ఎన్.క్రాంతికుమారి,కె.హేమలత,కె.మమతాంజలి,వై.మంజుల మద్రాసుకు చెందిన కె.సి.పి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యారు.ఎంపికైన విద్యార్థులందరినీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ అభినందించారు.నేటి విద్యార్థులందరూ సాఫ్ట్ వెర్ ఉద్యోగాల వైపే పరిమితమవడం కాకుండా,కోర్ ఇంజనీరింగ్ బ్రాంచిలలో కూడా మెరుగైన అవకాశాలున్నాయని తెలుసుకోవాలన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా మెటలర్జీ విభాగ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి,ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారని డైరెక్టర్ తెలియజేసారు.ఈ సంవత్సరం వంద శాతం ఉద్యోగాల కల్పనతో మెటలర్జీ విభాగం విద్యార్థులు ముందంజలో ఉన్నదని తెలియజేసారు.దేశానికి మెటలర్జీ విభాగంలో ఉదోగార్థుల కొరత ఉందనీ,ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనీ, విభాగాధిపతి డాక్టర్.బి. వెంకటేశ్వర్లు తెలియజేసారు.జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూడా నూజివీడు మెటలర్జీ విభాగ విద్యార్థులు రాణించి,అవకాశాలను అందిపుచ్చుకుని స్థిరపడ్డారని తెలియజేసారు.