ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ట్రిపుల్ ఐటీ నూజివీడు మెటలర్జీ ఇంజనీరింగ్ విద్యార్థులు ‘కె.సి.పి ఇంజనీర్స్ ప్రై. లిమిటెడ్’ కంపెనీ ఉద్యోగానికి ఎంపిక
Updated on: 2024-12-16 17:00:00

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజిలోని మెటలర్జీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు నీలపు.శ్రీవాణి, ఎన్.క్రాంతికుమారి,కె.హేమలత,కె.మమతాంజలి,వై.మంజుల మద్రాసుకు చెందిన కె.సి.పి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యారు.ఎంపికైన విద్యార్థులందరినీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ అభినందించారు.నేటి విద్యార్థులందరూ సాఫ్ట్ వెర్ ఉద్యోగాల వైపే పరిమితమవడం కాకుండా,కోర్ ఇంజనీరింగ్ బ్రాంచిలలో కూడా మెరుగైన అవకాశాలున్నాయని తెలుసుకోవాలన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా మెటలర్జీ విభాగ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి,ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారని డైరెక్టర్ తెలియజేసారు.ఈ సంవత్సరం వంద శాతం ఉద్యోగాల కల్పనతో మెటలర్జీ విభాగం విద్యార్థులు ముందంజలో ఉన్నదని తెలియజేసారు.దేశానికి మెటలర్జీ విభాగంలో ఉదోగార్థుల కొరత ఉందనీ,ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనీ, విభాగాధిపతి డాక్టర్.బి. వెంకటేశ్వర్లు తెలియజేసారు.జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూడా నూజివీడు మెటలర్జీ విభాగ విద్యార్థులు రాణించి,అవకాశాలను అందిపుచ్చుకుని స్థిరపడ్డారని తెలియజేసారు.