ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
రతన్ టాటా మృతితో భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. శాసనసభ్యులు వనమాడి కొండబాబు
Updated on: 2024-10-10 18:59:00

పారిశ్రామిక దిగ్గజం మానవతా మూర్తి విలువలతో కూడిన వ్యాపారవేత్త రతన్ టాటా గారని, రతన్ టాటా మృతితో భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందిని శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రతన్ టాటా చిత్రపటానికి పూలమాల వేసి కొండబాబు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగిన వ్యక్తి రతన్ టాటా ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందారని, గొప్ప మానవతా మూర్తి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని, తన సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారని, ముఖ్యంగా కరోనా సమయములో భారీ విరాళం అందించారని, స్థిరమైన వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసి విలువలతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పరిచారని, వ్యాపార రంగంలో చెరగని ముద్ర వేశారని, దూర దృష్టితో ఆలోచించి వ్యాపార రంగంలో అడుగులు వేసి సక్సెస్ సాధించారని, ప్రపంచ వ్యాప్తంగా 100 కుపైగా దేశాలలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన రతన్ టాటా ఎందరికో ప్రత్యక్షంగా పరోక్షంగా మరేందరికో ఉపాధికి కారకులయ్యారని, కష్టపడే తత్వం సేవా దృక్పధం ఆయన స్థాయిని పెంచాయిని, టాటా కంపెనీ అంటే ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించారని, రతన్ టాటా మృతి యావత్ భారతదేశాన్ని కదిలించిందని, భారతదేశం గొప్ప వ్యాపారవేత్తని మానవతా మూర్తిని కోల్పోయిందిని తెలిపారు.