ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అజాతశత్రువు సీతారాం ఏచూరి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి
Updated on: 2024-09-12 21:19:00
సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. రాజకీయాల్లో సీతారాం ఏచూరి అజాతశత్రువుగా నిలిచారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అని అన్నారు. అత్యంత మేధోసంపత్తి కలిగిన నాయకుడని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని అన్నారు. సిపిఎం పార్టీ ప్రజా యోధుడిని కోల్పోయిందన్నారు. ఏచూరి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.