ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
విజయ హై స్కూల్ లో ఘనంగా రక్షాబంధన్
Updated on: 2024-08-17 17:19:00

విజయ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించారు నిర్వహించారు విజయ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ముఖ్య అతిథి రాజుల వారి దిగంబర్ (ఏకలవ్య ఫౌండేషన్ మెంబర్) మాట్లాడుతూ దేశాన్ని రక్షించుకునే బాధ్యత అందరిదీ అని భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చిన్న పెద్ద జాతి భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు . దేశ రక్షణ కి ప్రేరణ రక్షా బంధన్అని తెలిపారు. రాఖీ పౌర్ణమి విశిష్టతను తెలియజేస్తూ తెలుగు ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ టి. కె. వి రామానుజాచార్యులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. పూర్వం రక్షకట్టి వేదాలు నేర్పే వారని మనందరం దేశాన్ని రక్షించుకోవాలని నీకు నేను రక్ష నీవు నాకు రక్ష మనందరం దేశానికి రక్ష అని తెలిపారు. పాఠశాల విద్యార్థినులు విద్యార్థులకు "రక్ష "కట్టారు. ఈ కార్యక్రమంలో గొల్ల వెంకటేశ్వర్ మంచిరాల నాగభూషణం , ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీరం విజయలక్ష్మి , ప్రిన్సిపల్ సామ మోహన్ రెడ్డి , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.