ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
విజయ హై స్కూల్ లో ఘనంగా రక్షాబంధన్
Updated on: 2024-08-17 17:19:00

విజయ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించారు నిర్వహించారు విజయ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ముఖ్య అతిథి రాజుల వారి దిగంబర్ (ఏకలవ్య ఫౌండేషన్ మెంబర్) మాట్లాడుతూ దేశాన్ని రక్షించుకునే బాధ్యత అందరిదీ అని భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చిన్న పెద్ద జాతి భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు . దేశ రక్షణ కి ప్రేరణ రక్షా బంధన్అని తెలిపారు. రాఖీ పౌర్ణమి విశిష్టతను తెలియజేస్తూ తెలుగు ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ టి. కె. వి రామానుజాచార్యులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. పూర్వం రక్షకట్టి వేదాలు నేర్పే వారని మనందరం దేశాన్ని రక్షించుకోవాలని నీకు నేను రక్ష నీవు నాకు రక్ష మనందరం దేశానికి రక్ష అని తెలిపారు. పాఠశాల విద్యార్థినులు విద్యార్థులకు "రక్ష "కట్టారు. ఈ కార్యక్రమంలో గొల్ల వెంకటేశ్వర్ మంచిరాల నాగభూషణం , ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీరం విజయలక్ష్మి , ప్రిన్సిపల్ సామ మోహన్ రెడ్డి , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.