ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి నూతన ప్రగతికి ప్రణాళికలు : ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
Updated on: 2024-08-12 21:09:00

కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి నూతన ప్రగతి ప్రణాళిక రూపొందించి, గత వైసిపి ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ తుమ్ములను దోచుకున్న ద్వారంపూడి పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మిన్సిపల్ కమీషనర్ బావన ఐ.ఏ.ఎస్ ను కలిసి గత ప్రభుత్వ హయాంలో 2019 నుండి 2024 వరకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ను ఏ విధంగా లూటి చేశారో అన్ని అంశాలను ఆధారాలతో సహా అందజేసి విచారణ చేపట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా కేవలం ప్రజలు కట్టిన పన్నులు వందల కోట్ల రూపాయిలు దోచేసాడని, కాకినాడ అభివృద్ధి గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోనే అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరిగిందని, మాజీ ఎమ్మెల్యే తన పదవీకాలం అంతా అధికారం అడ్డు పెట్టుకుని గతంలో చేసిన ప్రగతి పనులకు తిరిగి బిల్లులు చేయించుకుని కోట్ల రూపాయిలు తన స్వంత ఖాజానాకు తరలించుకుపోయాడని పేర్కొన్నారు. ప్రజలు కట్టే పన్నులు సొమ్ములను దుబారా చేయకుండా కేవలం కాకినాడ నగర అభివృద్ధికి వెచ్చించడం జరుగుతుందని, ప్రధానంగా డ్రైన్లు నిర్వహణ, పారిశుధ్య పర్యవేక్షణ, విద్య, వైద్యం, విద్యుత్ అంశాలపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. తన హయాములో కాకినాడ అభివృద్ధి ఎలా ఉండాలి అని ప్రజలు భావిస్తున్నారో అవిధంగా అభివృద్ధి ప్రజలకు అందించే విధంగా నూతన కార్యాచరణ రూపొందిస్తున్నట్లి సిటీ ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. ఆయన వెంట తెదేపా నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, గుమ్మల్ల చిన్నా తదితరులు ఉన్నారు.