ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి నూతన ప్రగతికి ప్రణాళికలు : ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
Updated on: 2024-08-12 21:09:00
కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి నూతన ప్రగతి ప్రణాళిక రూపొందించి, గత వైసిపి ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ తుమ్ములను దోచుకున్న ద్వారంపూడి పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మిన్సిపల్ కమీషనర్ బావన ఐ.ఏ.ఎస్ ను కలిసి గత ప్రభుత్వ హయాంలో 2019 నుండి 2024 వరకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ను ఏ విధంగా లూటి చేశారో అన్ని అంశాలను ఆధారాలతో సహా అందజేసి విచారణ చేపట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా కేవలం ప్రజలు కట్టిన పన్నులు వందల కోట్ల రూపాయిలు దోచేసాడని, కాకినాడ అభివృద్ధి గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోనే అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరిగిందని, మాజీ ఎమ్మెల్యే తన పదవీకాలం అంతా అధికారం అడ్డు పెట్టుకుని గతంలో చేసిన ప్రగతి పనులకు తిరిగి బిల్లులు చేయించుకుని కోట్ల రూపాయిలు తన స్వంత ఖాజానాకు తరలించుకుపోయాడని పేర్కొన్నారు. ప్రజలు కట్టే పన్నులు సొమ్ములను దుబారా చేయకుండా కేవలం కాకినాడ నగర అభివృద్ధికి వెచ్చించడం జరుగుతుందని, ప్రధానంగా డ్రైన్లు నిర్వహణ, పారిశుధ్య పర్యవేక్షణ, విద్య, వైద్యం, విద్యుత్ అంశాలపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. తన హయాములో కాకినాడ అభివృద్ధి ఎలా ఉండాలి అని ప్రజలు భావిస్తున్నారో అవిధంగా అభివృద్ధి ప్రజలకు అందించే విధంగా నూతన కార్యాచరణ రూపొందిస్తున్నట్లి సిటీ ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. ఆయన వెంట తెదేపా నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, గుమ్మల్ల చిన్నా తదితరులు ఉన్నారు.