ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు..అధికారులందరూ వరద సహాయక చర్యలలో నిమగ్నం- జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
Updated on: 2024-07-28 12:23:00

గోదావరి పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద నీరు చేరి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో జిల్లా, మండల గ్రామ స్థాయి అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది అందరూ సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నందున జూలై 29 సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పి జి ఆర్ ఎస్) కార్యక్రమం రద్దు చేయబడింది' అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు