ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రుణమాఫీ నిధులు విడుదల ఈరోజే - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Updated on: 2024-07-18 07:37:00

ప్రతి మండలంలో భారీ ఎత్తున రుణమాఫీ సంబరాలు, హాజరుకానున్న ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రుణమాఫీ హామీను నిలబెట్టుకునే క్రమంలో మూడు విడతల్లో రెండు లక్షల లోపు ఉన్న మాఫీ చేస్తాం అని ప్రకటించిన ప్రభుత్వం ,ఆ ప్రక్రియలో భాగంగా నేటి సాయంత్రం నాలుగు గంటల లోపు రాష్ట్రవ్యాప్తంగా లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు, ఆగస్టు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేయుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం కేవలం 28 వేల కోట్ల రూపాయల మాత్రమే మాఫీ కానీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే క్రమంలో ఈ ఒక్క సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.