ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయించండి - నీటిపారుదల శాఖ మంత్రిని కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర ఎమ్మెల్యేలు
Updated on: 2024-07-16 08:04:00
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయించాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు తదితర ఎమ్మెల్యేలు కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మరియు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులు కలిసి మంత్రికి విజ్ఞాపన చేశారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాణంతో షాద్ నగర్, పరిగి, చేవెళ్ల, తాండూరు నియోజకవర్గ ప్రజలు సాగు కష్టాలను తీర్చవచ్చని తెలియజేసి నిధుల మంజూరుకు ఒప్పించడం జరిగిందని వారు మీడియాతో పేర్కొన్నారు.
మొబైల్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్
షాద్ నగర్ పట్టణంలోని జడ్చర్ల రహదారిలో ఓ మొబైల్ షాపును స్థానిక ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ తదితరులు ప్రారంభించారు. యువత స్వయం ఉపాధి వైపు దూసుకుపోవాలని వారికి ప్రభుత్వ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. యువత ఆర్థిక రంగం వైపు దృష్టిసాదించడం మంచి పరిణామం ఈ సందర్భంగా మొబైల్ నిర్వాహకులను అభినందించారు.