ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కార్యాచరణ - ఆదిరెడ్డి శ్రీనివాస్
Updated on: 2024-07-13 15:40:00
నగరంలో వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టవంతం చేస్తాం - జోరు వానలో 22, 36 డివిజన్లలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న...
రాజమహేంద్రవరం : నగరంలో కురిసిన వర్షపు నీరు నిలువ ఉండకుండా డ్రైనేజీలు ద్వారా దిగువ ప్రాంతానికి పారుదలయ్యే విధంగా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయడం వలన.. ఇంత వర్షం పడుతున్న రోడ్లపై చుక్క నీరు కూడా లేదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నగరంలోని 22, 36 డివిజన్లలో పర్యటించి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరచటం కారణంగా ఈరోజు ఏక దాటిగా దాదాపు ఎనిమిది గంటల పాటు వర్షం పడిన వర్షపు నీరు నిలవ ఉండకుండా డ్రైనేజీలు ద్వారా దిగు ప్రాంతానికి వెళ్లడం జరిగిందన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచవలసి ఉందని ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ నాయకులు డ్రైనేజీ వ్యవస్థ పై దృష్టి సారించ లేదని అందుమూలంగా డ్రైనేజీ వ్యవస్థ కుంటుపడి చిన్నపాటి వర్షానికే వీధులు జలమయం అయ్యేవి అన్నారు. గత నెల రోజులుగా ఆరోగ్యశాఖ, నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో ప్రజల ఆరోగ్య దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్, డ్రైనేజీ ప్రక్షాళన వంటి కార్యక్రమాలు చేపట్టటం వలన ఈరోజు వర్షం నీరు వచ్చిన నిలువు లేకుండా డ్రైనేజీ ద్వారా పారుదలయ్యాయి అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా వర్షం పడుతున్నప్పటికీ నేడు 22వ వార్డులో వర్షాన్ని కూడా లెక్క చెయ్యకుండా అధికారులతో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా రేపు మంగళవారం ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించి సీజనల్ వ్యాధులు, డయేరియా ప్రబలకుండా నిర్మూలించే దిశగా పటిష్టమైన ప్రణాళిక ద్వారా కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యాళ్ల ప్రదీప్, శెట్టి జగదీష్, మటూరి సిద్దు, నారాయణరావు, రాజేష్, రాజా, నల్లం ఆనంద్, పింకేష్, అజిత్, బృంగిమల, నారాయణ, దాసరి రమేష్, ఫైండ రవి నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.