ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
గుండ్లకమ్మ ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలి జిల్లా కలెక్టర్
Updated on: 2024-07-12 18:59:00
మద్దిపాడు జూలై 12 గుండ్లకమ్మ రిజర్వాయర్ చివరి ఆయకట్టు రైతులకు తక్షణం సాగునీరు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అమీము్ అన్సరియా అన్నారు శుక్రవారం గుండ్లకమ్మ రిజర్వాయర్ను సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్సారియా మాట్లాడుతూ ప్రాజెక్టులో జరుగుతున్న మరమ్మత్తుల పనులను పూర్తి చేయాలన్నారు.12 గేట్లు ను సైట్ ఇంజనీర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గేట్లకు సాండ్ బ్లాస్టింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ ను వెల్లడించారు. పనులు జాప్యం లేకుండా చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్టు కింద నీటి సరఫరా భూ సేకరణ అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇరిగేషన్ ఎస్సీ నాగ మురళీమోహన్ కలెక్టర్కు వివరించారు. కుడి కాలువ క్రింద 28 వేల ఎకరాలకు నీరు అందించేలా పూడికలు తీసి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసినట్లు కలెక్టర్కు తెలిపారు. ఎడమ కాలు క్రింద భూసేకరణకు సమస్యలు తలెత్త డంతో వర్క్ ఆర్డర్ ను ప్రభుత్వం రద్దు చేసిందని కలెక్టర్కు తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీవో జీవి సుబ్బారెడ్డి తాసిల్దార్ అనురాధ ఇరిగేషన్ డి ఈ కే నాగరాజు ఏఈ వై రామాంజనేయులు రెవిన్యూ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.