ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కూటమి ప్రభుత్వం లో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత - ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
Updated on: 2024-07-10 17:35:00
కూటమి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో RMC పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మిస్తున్న మాత శిశు నూతన భవన నిర్మాణంతో పాటు పలు విభాగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు విభాగం త్వరలోనే అందుబాటులో రానున్నదని, రామ్ కానా కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనారాయణ పరిరక్షణలో బిల్డింగ్ పనులు చేయడం జరుగుతుందనని, రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నార్త్ అమెరికా సహకారంతో రూ.30 కోట్లుతో బిల్డింగ్ నిర్మాణానికి చేపట్టడం జరుగుతుందని, గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టలేకపోయారన్నారు.
1150 పడగల ఆసుపత్రి అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు పడకలో సరిపోవడం లేదని, నూతన బిల్డింగ్ అందుబాటులోకి వస్తే 500 పడకలు గర్భిణీ చిన్నారులకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు, డాక్టర్ లావణ్య కుమారి, రామ్ కానా... రాంకోస సభ్యులు డాక్టర్ చిట్లకిరణ్ కుమార్, డాక్టర్ తేజో కృష్ణ, డా. అరుణ ఆదిత్య, డా ఆనంద్, డాక్టర్ కొండమూరి సత్యనారాయణణ, మల్లిపూడి వీరు, నల్లూరి శ్రీనివాస్, సంగిశెట్టి అశోక్, మల్లాడి గంగాధరం తదితరులు పాల్గొన్నారు.