ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఉచిత ఇసుక పాలసీ-రాష్ట్ర ప్రగతికి బాట : కాకినాడ జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్
Updated on: 2024-07-08 19:39:00
నెరవేరనున్న పేదల సొంతింటి కల-ఊపందుకోనున్న నిర్మాణ రంగం.
* ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయం. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యుల భారీ ఊరట లభించింది. * ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి నెల రోజుల లోపే అమలలోకి తేచ్చారు. * ఫ్రీ శాండ్ పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం ...బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుంది. * నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే తెలుగుదేశం విధానం. పారదర్శకత, ముందుచూపుతో శాండ్ పాలసీని రూపొందించడం జరిగింది. ఇసుక మాఫియాతో కోట్లు కొల్లగొట్టిన జగన్ రెడ్డి: * గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపింది. ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే రూ.50 వేల కోట్లకు పైగా కొల్లగొట్టారు. వైసీపీ నేతలే స్వయంగా ఇసుకాసురు అవతారం ఎత్తి దోచుకున్నారు. * పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఖర్చు అయితే అందులో ఇసుక కొనడానికే రూ. 3 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను జగన్ అండ్ కో మింగేశారు. వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షలకు పైగా ఇళ్లు కట్టొచ్చంటే వారి అవినీతి ఏ స్థాయిలో అవినీతి చేశారో అర్ధం చేసుకోవచ్చు.
ఇసుక పాలసీ అమల్లో నిరంతర పర్యవేక్షణ:....అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ రాష్ట్ర ప్రజల ప్రగతే ధ్యేయంగా ఈ పాలసీ రూపొందించారు. దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుంది. * సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తాం. * జిల్లాల స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, మైనింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు.