ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఏపీ టు ఆఫ్రికా.. రేషన్ బియ్యం స్కామ్ లో అడ్డంగా బుక్కైన ద్వారంపూడి
Updated on: 2024-07-02 07:13:00

రేషన్ బియ్యం స్కామ్ను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.ఈ స్కామ్లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది.రెండు రోజులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో మకాం వేశారు.కాకినాడ సిటీలో,పోర్టులో స్వయంగా మంత్రి నాదెండ్ల తనిఖీలు చేశారు.కాకినాడ పోర్టులో అశోక్ ఇంటర్నేషనల్,హెచ్ వన్ గోడౌన్లలో భారీగా రేషన్ బియ్యం గుర్తించారు.ఆ బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందుకుని అధికారులు.రెండు గోడౌన్లను సీజ్ చేశారు.రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లో జరిగిందటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కాకినాడ పోర్టును ద్వారంపూడి.. తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.ద్వారంపూడి అరాచకాలు చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.తనిఖీలు పూర్తి అయ్యేంత వరకు పోర్టు నుంచి బియ్యం రవాణా నిలిపివేశారు.రాష్ట్రంలో పేదల పొట్ట కొట్టి అదే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటూ మండిపడ్డారు.పౌరసరఫరాల శాఖ సంబంధించి శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.పూర్తిస్థాయి పరిశీలన జరిపాక సీఐడీతో విచారణ కూడా జరిపిస్తామని మంత్రి నాదెండ్ల అన్నారు.