ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
మీకోసం అర్జీలు సత్వరం పరిష్కరించాలి
Updated on: 2024-06-24 14:40:00

శ్రీకాకుళం: మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు సత్వరం ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తో పాటు జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతి రావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డిఎ, పి.డి కిరణ్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి 148 అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో కెఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, జెడ్పి సిఇఓ డి.వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి బి.మీనాక్షి, డ్వామా పి.డి చిట్టి రాజు, డిసిహెచ్ఎస్ డా.రాజ్యలక్ష్మి, హౌసింగ్ పి.డి గణపతి రావు, ఇరిగేషన్ ఎస్.ఇ రాంబాబు, జిల్లా ఉద్యాన అధికారి ఆర్.వి ప్రసాద రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.