ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పోలీస్ స్టేషన్లో తనిఖీ చేసిన ఎస్పీ
Updated on: 2024-06-22 15:04:00
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక శనివారం ఉదయం బుర్జా పోలీస్ స్టేషన్ ని సందర్శించి తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో ముందుగా పోలీస్ స్టేషన్ సిబ్బంది జిల్లా ఎస్పీ నకు గౌరవ వందనం సమర్పించారు.అనంతరం జిల్లా ఎస్పీ స్టేషన్ ఆవరణంలో పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎటువంటి అనాధికారమైన కేసు ప్రాపర్టీని స్టేషన్లో ఉంచకుండా కోర్టు ఉత్తర్వులు మేరకు డిస్పోజల్ చేయాలని సూచించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, ముఖ్యమైన కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తుపై అధికారులను అడిగి తెలుసుకుని,దర్యాప్తుపై దిశానిర్దేశాలు చేశారు. బాధితులు,పిర్యాదు దారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలఫై సానుకూలంగా స్పందించి చట్ట ప్రకారం న్యాయం చేయాలన్నారు. నాటు సారా,గంజాయి వంటి మాదక ద్రవ్యాలు క్రయ, విక్రయాలు,అక్రమ రవాణా ను అరికట్టాలని, మాదకద్రవ్యాలు వినియోగం వలన కలిగే దుష్ప్రభావలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.రహదారి ప్రమాదాల నివారణకు ప్రణాళిక మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ వెంట ఆమదాలవలస సీఐ దివాకర్, బుర్జ ఎస్ఐ ఉన్నారు.