ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
పోలీస్ స్టేషన్లో తనిఖీ చేసిన ఎస్పీ
Updated on: 2024-06-22 15:04:00

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక శనివారం ఉదయం బుర్జా పోలీస్ స్టేషన్ ని సందర్శించి తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో ముందుగా పోలీస్ స్టేషన్ సిబ్బంది జిల్లా ఎస్పీ నకు గౌరవ వందనం సమర్పించారు.అనంతరం జిల్లా ఎస్పీ స్టేషన్ ఆవరణంలో పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎటువంటి అనాధికారమైన కేసు ప్రాపర్టీని స్టేషన్లో ఉంచకుండా కోర్టు ఉత్తర్వులు మేరకు డిస్పోజల్ చేయాలని సూచించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, ముఖ్యమైన కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తుపై అధికారులను అడిగి తెలుసుకుని,దర్యాప్తుపై దిశానిర్దేశాలు చేశారు. బాధితులు,పిర్యాదు దారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలఫై సానుకూలంగా స్పందించి చట్ట ప్రకారం న్యాయం చేయాలన్నారు. నాటు సారా,గంజాయి వంటి మాదక ద్రవ్యాలు క్రయ, విక్రయాలు,అక్రమ రవాణా ను అరికట్టాలని, మాదకద్రవ్యాలు వినియోగం వలన కలిగే దుష్ప్రభావలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.రహదారి ప్రమాదాల నివారణకు ప్రణాళిక మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ వెంట ఆమదాలవలస సీఐ దివాకర్, బుర్జ ఎస్ఐ ఉన్నారు.