ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
పోలీస్ స్టేషన్లో తనిఖీ చేసిన ఎస్పీ
Updated on: 2024-06-22 15:04:00
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక శనివారం ఉదయం బుర్జా పోలీస్ స్టేషన్ ని సందర్శించి తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో ముందుగా పోలీస్ స్టేషన్ సిబ్బంది జిల్లా ఎస్పీ నకు గౌరవ వందనం సమర్పించారు.అనంతరం జిల్లా ఎస్పీ స్టేషన్ ఆవరణంలో పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎటువంటి అనాధికారమైన కేసు ప్రాపర్టీని స్టేషన్లో ఉంచకుండా కోర్టు ఉత్తర్వులు మేరకు డిస్పోజల్ చేయాలని సూచించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, ముఖ్యమైన కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తుపై అధికారులను అడిగి తెలుసుకుని,దర్యాప్తుపై దిశానిర్దేశాలు చేశారు. బాధితులు,పిర్యాదు దారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలఫై సానుకూలంగా స్పందించి చట్ట ప్రకారం న్యాయం చేయాలన్నారు. నాటు సారా,గంజాయి వంటి మాదక ద్రవ్యాలు క్రయ, విక్రయాలు,అక్రమ రవాణా ను అరికట్టాలని, మాదకద్రవ్యాలు వినియోగం వలన కలిగే దుష్ప్రభావలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.రహదారి ప్రమాదాల నివారణకు ప్రణాళిక మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ వెంట ఆమదాలవలస సీఐ దివాకర్, బుర్జ ఎస్ఐ ఉన్నారు.