ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఘనంగా జరిగిన యోగా దినోత్సవం
Updated on: 2024-06-21 13:05:00
యోగాతో మానసిక, శారీరక ఒత్తిడులను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా రెవిన్యూ అధికారి ఎం గణపతి రావు అన్నార అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, యువజన సర్వీసులు శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆద్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవిన్యూ అధికారి ఎం గణపతి రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచే యోగాభ్యాసాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని, నిరంతర సాధన చెయ్యాలని, నేటి జీవన విధానంలో నిత్యం అధిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నామని, తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని తెలిపారు. ఇటువంటి తరుణంలో యోగా చక్కని పరిష్కారమని, యోగాతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. యోగా వలన నూతనోత్తేజం లభిస్తుందని, దీనివలన మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం కలగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆయుష్ శాఖ శ్రీకాకుళం , సీనియర్ మెడికల్ ఆఫీసర్, మాట్లాడుతూ, ఆయుష్ శాఖ కమీషనర్, జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ ఆదేశాల మేరకు, యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని, యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని, యోగా వలన బిపి,సుగర్, మూనసిక రోగాల నుండి దూరం చేసుకోవచ్చని తెలియజేసారు.