ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఘనంగా జరిగిన యోగా దినోత్సవం
Updated on: 2024-06-21 13:05:00
యోగాతో మానసిక, శారీరక ఒత్తిడులను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా రెవిన్యూ అధికారి ఎం గణపతి రావు అన్నార అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, యువజన సర్వీసులు శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆద్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవిన్యూ అధికారి ఎం గణపతి రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచే యోగాభ్యాసాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని, నిరంతర సాధన చెయ్యాలని, నేటి జీవన విధానంలో నిత్యం అధిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నామని, తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని తెలిపారు. ఇటువంటి తరుణంలో యోగా చక్కని పరిష్కారమని, యోగాతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. యోగా వలన నూతనోత్తేజం లభిస్తుందని, దీనివలన మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం కలగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆయుష్ శాఖ శ్రీకాకుళం , సీనియర్ మెడికల్ ఆఫీసర్, మాట్లాడుతూ, ఆయుష్ శాఖ కమీషనర్, జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ ఆదేశాల మేరకు, యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని, యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని, యోగా వలన బిపి,సుగర్, మూనసిక రోగాల నుండి దూరం చేసుకోవచ్చని తెలియజేసారు.