ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
ప్రజలకు అవినీతి లేని పాలన అందించాలి ... ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
Updated on: 2024-06-14 06:58:00

బాపట్ల: పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పురపాలక సంఘం అధికారులతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు తోలి రివ్యూ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో దోమల బెడద అధికంగా ఉందని దోమల నివారణకు అధికారులు తీవ్ర కృషి చేయవలసిన బాధ్యత ఉందన్నారు. అవినీతి లేని పాలన అందించడానికి అధికారులు ముందుకు వెళ్లాలని సూచన చేశారు.పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించి పురవీధులన్నీ పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. అధికారులు బాధ్యతగా పనిచేసే ప్రజలకు జవాబుదారులుగా నిలవాలని సూచనలు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని ప్రతి రోజూ డ్రైనేజీలను పరిశుభ్ర పరుస్తూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.అన్ని వార్డులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వెళుతున్నానని వివరించారు.పారిశుధ్య కార్మికులను ప్రజా ప్రతినిధులు,అధికారుల నివాసాలలో పనులకు పంపించకుండా ఉండాలని ప్రభుత్వ జీతాలు ఇస్తూ అధికారుల నివాసాలలో ప్రజాప్రతినిధుల నివాసాలలో పనులు చేయిస్తే సహించేది లేదన్నారు. స్వయంగా ప్రతి ఒక్క పాశుద్ధ్య కార్మికుడితో తాను మాట్లాడతానని పాశుద్ధ్య కార్మికుల సమస్యలు అన్నిటికీ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అవినీతి లేని పాలన చేసి ప్రభుత్వానికి మంచి పేరు అధికారులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.