ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అధినేత చంద్రబాబు,లోకేష్ లను కలిసిన ఎమ్మెల్యే ఏలూరి
Updated on: 2024-06-06 18:44:00
హ్యాట్రిక్ విజేతగా నిలిచిన ఏలూరికి అభినందనలు తెలిపిన నేతలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ అద్భుతమైన ఘనవిజయం సాధించడం పట్ల అధినేతకు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హ్యాట్రిక్ విజేతగా నిలిచిన ఎమ్మెల్యే ఏలూరిని అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం యువ నేత నారా లోకేషను కలిశారు. ఘన విజయం సాధించినందుకు ఇద్దరూ పరస్పరం అభినందించుకున్నారు. పర్చూరు నియోజకవర్గం చరిత్రను తిరగరాసి భారీ మెజారిటీలో రికార్డు బద్దలు చేయడం పట్ల లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఏలూరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ అపార అనుభవం ముందుచూపుతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు. అనంతరం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.