ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
అధినేత చంద్రబాబు,లోకేష్ లను కలిసిన ఎమ్మెల్యే ఏలూరి
Updated on: 2024-06-06 18:44:00

హ్యాట్రిక్ విజేతగా నిలిచిన ఏలూరికి అభినందనలు తెలిపిన నేతలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ అద్భుతమైన ఘనవిజయం సాధించడం పట్ల అధినేతకు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హ్యాట్రిక్ విజేతగా నిలిచిన ఎమ్మెల్యే ఏలూరిని అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం యువ నేత నారా లోకేషను కలిశారు. ఘన విజయం సాధించినందుకు ఇద్దరూ పరస్పరం అభినందించుకున్నారు. పర్చూరు నియోజకవర్గం చరిత్రను తిరగరాసి భారీ మెజారిటీలో రికార్డు బద్దలు చేయడం పట్ల లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఏలూరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ అపార అనుభవం ముందుచూపుతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు. అనంతరం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.