ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
అధినేత చంద్రబాబు,లోకేష్ లను కలిసిన ఎమ్మెల్యే ఏలూరి
Updated on: 2024-06-06 18:44:00
హ్యాట్రిక్ విజేతగా నిలిచిన ఏలూరికి అభినందనలు తెలిపిన నేతలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ అద్భుతమైన ఘనవిజయం సాధించడం పట్ల అధినేతకు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హ్యాట్రిక్ విజేతగా నిలిచిన ఎమ్మెల్యే ఏలూరిని అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం యువ నేత నారా లోకేషను కలిశారు. ఘన విజయం సాధించినందుకు ఇద్దరూ పరస్పరం అభినందించుకున్నారు. పర్చూరు నియోజకవర్గం చరిత్రను తిరగరాసి భారీ మెజారిటీలో రికార్డు బద్దలు చేయడం పట్ల లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఏలూరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ అపార అనుభవం ముందుచూపుతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు. అనంతరం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.