ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఇకనుండి ధర్మవరం అభివృద్ధి బాధ్యత నాది- - ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-06-05 19:04:00

ధర్మవరం , జూన్ 5 : సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ముమ్మాటికి ధర్మవరం ప్రజల గెలుపేనని ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్య కుమార్ యాదవ్ ను అభినందనలు తెలియజేయడానికి పట్టణంలోని బిజెపి కార్యాలయానికి బుధవారం వేలాది ప్రజలు తరలివచ్చారు. ఉదయం నుండి బిజెపి టిడిపి జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు గజమాలలు , పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్య కుమార్ కు అభినందనలు తెలిపారు. వేలాది ప్రజలు గుమి కూడడంతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఆదరించి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన ధర్మవరం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు కేతిరెడ్డి అరాచక పాలనలో అభివృద్ధికి దూరమైన ధర్మవరం నియోజకవర్గాన్ని జాతీయస్థాయిలో పేరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమ ఓటు ద్వారా రాక్షస రాజ్యానికి అంతం పలికారని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానని చెప్పారు. గత ఐదేళ్లుగా అరాచకాలు కబ్జాలు రౌడీయిజం వల్ల కష్టాలు పడిన ప్రజలు ఇకపై ప్రశాంతంగా ఉండవచ్చని చెప్పారు.