ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
ఇకనుండి ధర్మవరం అభివృద్ధి బాధ్యత నాది- - ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-06-05 19:04:00
ధర్మవరం , జూన్ 5 : సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ముమ్మాటికి ధర్మవరం ప్రజల గెలుపేనని ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్య కుమార్ యాదవ్ ను అభినందనలు తెలియజేయడానికి పట్టణంలోని బిజెపి కార్యాలయానికి బుధవారం వేలాది ప్రజలు తరలివచ్చారు. ఉదయం నుండి బిజెపి టిడిపి జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు గజమాలలు , పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్య కుమార్ కు అభినందనలు తెలిపారు. వేలాది ప్రజలు గుమి కూడడంతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఆదరించి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన ధర్మవరం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు కేతిరెడ్డి అరాచక పాలనలో అభివృద్ధికి దూరమైన ధర్మవరం నియోజకవర్గాన్ని జాతీయస్థాయిలో పేరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమ ఓటు ద్వారా రాక్షస రాజ్యానికి అంతం పలికారని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానని చెప్పారు. గత ఐదేళ్లుగా అరాచకాలు కబ్జాలు రౌడీయిజం వల్ల కష్టాలు పడిన ప్రజలు ఇకపై ప్రశాంతంగా ఉండవచ్చని చెప్పారు.