ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఇకనుండి ధర్మవరం అభివృద్ధి బాధ్యత నాది- - ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-06-05 19:04:00
ధర్మవరం , జూన్ 5 : సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ముమ్మాటికి ధర్మవరం ప్రజల గెలుపేనని ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్య కుమార్ యాదవ్ ను అభినందనలు తెలియజేయడానికి పట్టణంలోని బిజెపి కార్యాలయానికి బుధవారం వేలాది ప్రజలు తరలివచ్చారు. ఉదయం నుండి బిజెపి టిడిపి జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు గజమాలలు , పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్య కుమార్ కు అభినందనలు తెలిపారు. వేలాది ప్రజలు గుమి కూడడంతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఆదరించి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన ధర్మవరం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు కేతిరెడ్డి అరాచక పాలనలో అభివృద్ధికి దూరమైన ధర్మవరం నియోజకవర్గాన్ని జాతీయస్థాయిలో పేరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమ ఓటు ద్వారా రాక్షస రాజ్యానికి అంతం పలికారని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానని చెప్పారు. గత ఐదేళ్లుగా అరాచకాలు కబ్జాలు రౌడీయిజం వల్ల కష్టాలు పడిన ప్రజలు ఇకపై ప్రశాంతంగా ఉండవచ్చని చెప్పారు.