ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పాత్రికేయుడు సుబ్బారావుకు అవార్డు రావడం గర్వకారణం
Updated on: 2024-05-31 14:42:00
ప్రముఖ పాత్రికేయుడు పులుసు వీర వెంకట సత్య సుబ్బారావుకు అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ (జీ.హెచ్.పీ.యూ) గౌరవ డాక్టరేట్ భారత కళారత్న అవార్డులు ఇచ్చి గౌరవించడం కొత్తపేట నియోజకవర్గానికే గర్వకారణం అని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో స్వగృహం నందు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులుగా, కవిగా, రచయితగా, నాటక కళాకారుడిగా, పాత్రికేయుడిగా సుబ్బారావు అందరికీ సూపరిచితులు అని, ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డు రావడం నియోజకవర్గానికే గర్వకారణం అని చిర్ల కొనియాడారు.ఈ మేరకు ఆయన అందుకున్న ధృవ పత్రాలు మెడల్ లను చిర్ల పరిశీలించి సుబ్బారావును దుశ్శాలువాతో సత్కరించారు. సుబ్బారావు ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధర్, సీనియర్ పాత్రికేయులు జగతా శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు), వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సఖినేటి వాకులరాజు, కొల్లి శ్యాంసన్, బొక్కా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.