ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
పాత్రికేయుడు సుబ్బారావుకు అవార్డు రావడం గర్వకారణం
Updated on: 2024-05-31 14:42:00

ప్రముఖ పాత్రికేయుడు పులుసు వీర వెంకట సత్య సుబ్బారావుకు అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ (జీ.హెచ్.పీ.యూ) గౌరవ డాక్టరేట్ భారత కళారత్న అవార్డులు ఇచ్చి గౌరవించడం కొత్తపేట నియోజకవర్గానికే గర్వకారణం అని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో స్వగృహం నందు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులుగా, కవిగా, రచయితగా, నాటక కళాకారుడిగా, పాత్రికేయుడిగా సుబ్బారావు అందరికీ సూపరిచితులు అని, ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డు రావడం నియోజకవర్గానికే గర్వకారణం అని చిర్ల కొనియాడారు.ఈ మేరకు ఆయన అందుకున్న ధృవ పత్రాలు మెడల్ లను చిర్ల పరిశీలించి సుబ్బారావును దుశ్శాలువాతో సత్కరించారు. సుబ్బారావు ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధర్, సీనియర్ పాత్రికేయులు జగతా శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు), వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సఖినేటి వాకులరాజు, కొల్లి శ్యాంసన్, బొక్కా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.