ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
విద్యుత్ కోతలు లేకుండా చూడాలి
Updated on: 2024-05-31 13:01:00
అసలే రోహిణి కార్తె, ఒక పక్క ఉక్కపోత ఆపై వేళాపాళాలేని విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని కాబట్టి విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కొత్తపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో శుక్రవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. వేళాపాళాలేని కరెంటు కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రాత్రివేళలో మరీ ఎక్కువుగా ఉంటుందని వాపోయారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరా పూర్తి స్దాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.