ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది - సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-05-30 19:24:00

ధర్మవరం, మే 30 : ఎన్నికల ఫలితాలు సమీపిస్తున్న కొద్ది వైసీపీ నేతల్లో ఓటమి భయం పెరిగిపోతోందని ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. పట్టణంలోని బిజెపి కార్యాలయంలో గురువారం కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఓట్ల లెక్కింపు విషయమై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పలు సూచనలు ఇచ్చారు. సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తెలిసిపోయిందని అందుకే ఎన్నికల కమిషన్ పై విమర్శలు గుప్పిస్తున్నాడని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మే 13న వైసిపి ఓటమిని నిశ్చయించారని జూన్ 4న ఫలితాల ద్వారా వైసిపి ఓటమిని పరిపూర్ణం చేయబోతున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందనే అక్కసుతోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత 15 రోజుల్లో 8 మంది రైతులు ముగ్గురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుని కష్టాల్లో ఉంటే సీఎం విదేశీ పర్యటనల్లో వినోదాల్లో మునిగితేలుతుండడం బాధాకరమన్నారు. వైసిపి అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజులు రానున్నాయని, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత ఎన్నికల్లో విజయం సాధించబోయి ఎన్ డి ఏ కూటమి తీసుకోబోతుందని ఆయన చెప్పారు.