ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ధర్మవరం డిపోకు 4 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు
Updated on: 2024-05-27 10:55:00
ధర్మవరం ఆర్టీసీ డిపోకు 4 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఇటీవలే రావడం జరిగిందని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రయాణికుల తాత్కాలిక అవసరాల దృష్ట్యా బీహెచ్ఈఎల్ కు, సికింద్రాబాద్కు, హైదరాబాదుకు పంపడం జరుగుతుందని తెలిపారు. మరొక బస్సు శని, ఆదివారాలలో ప్రత్యేకంగా దూరప్రాంతాలకు పంపడం జరుగుతోందని తెలిపారు. జూలై నెలలో 25 బస్సులు జిల్లాకు రానున్నాయని, అదేవిధంగా కొత్త బస్సులు కూడా ధర్మారం డిపోకు రానున్నాయని తెలిపారు. ప్రయాణికుల సుఖ ప్రయాణము కొరకు కొత్త బస్సులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ధర్మారం డిపో నుంచి అనేక బస్సులు వివిధ దూర ప్రాంతాలకు, జిల్లాలలో సర్వీసులు నడుస్తున్నాయని. ప్రయాణికులకు ఎక్కడ ఏదైనా సమస్య ఎదురైతే ధర్మవరం డిపో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రయాణికుల సంక్షేమమే మా ఆర్టీసీ దేయమని వారు తెలిపారు.