ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
Updated on: 2024-05-25 08:29:00

నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే పీడీయాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. నకిలీ, కాలంచెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగులమందులు అమ్మితే సహించేది లేదని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ప్రతి దుకాణం ఎదుట ఎరువులు, విత్తనాల ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీలర్ షాప్ లైసెన్స్ వివరాలను ప్రదర్శించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు, ఎరువులను విక్రయించాలన్నారు. విత్తనాలు, ఎరువుల నిల్వల వివరాలను రోజువారీగా రిజిష్టర్లలో పొందుపరచాలని చెప్పారు. రైతులు విత్తనాల ఖాళీ సంచులను పంటకాలం పూర్తయ్యే దాకా భద్రపరుచుకోవాలని, ఒకవేళ రైతు నష్టపోయినట్లయితే ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులు, డీలర్లు, ఫెర్టిలైజర్స్ యజమానులు పాల్గొన్నారు.