ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
భారీగా వాహనాలు స్వాదీనం
Updated on: 2024-05-21 13:52:00
అనకాపల్లి - జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఆదేశాల మేరకు పరవాడ సబ్ డివిజన్, ఎలమంచిలి సర్కిల్ సిఐ గఫూర్ ఆధ్వర్యంలో మునగపాక ఎస్సై ప్రసాదరావు,పరవాడ సబ్ డివిజన్ సిఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది తో నాగులాపల్లి గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి భారీ ఎత్తున రికార్డ్స్ లేని ద్విచక్ర వాహనాలు, ఆటోను మొత్తం 42 వాహనాలను మునగపాక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎలమంచిలి సిఐ నాగులాపల్లి గ్రామస్తులతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అనుమానస్పద ప్రాంతాల్లో ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. గ్రామస్తులు ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన రాదని హెచ్చరించారు.