ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
భారీగా వాహనాలు స్వాదీనం
Updated on: 2024-05-21 13:52:00
అనకాపల్లి - జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఆదేశాల మేరకు పరవాడ సబ్ డివిజన్, ఎలమంచిలి సర్కిల్ సిఐ గఫూర్ ఆధ్వర్యంలో మునగపాక ఎస్సై ప్రసాదరావు,పరవాడ సబ్ డివిజన్ సిఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది తో నాగులాపల్లి గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి భారీ ఎత్తున రికార్డ్స్ లేని ద్విచక్ర వాహనాలు, ఆటోను మొత్తం 42 వాహనాలను మునగపాక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎలమంచిలి సిఐ నాగులాపల్లి గ్రామస్తులతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అనుమానస్పద ప్రాంతాల్లో ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. గ్రామస్తులు ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన రాదని హెచ్చరించారు.