ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
కందివనం యువకుడి నిరసనకు స్పందించిన అధికారులు గ్రామలలో బెల్ట్ షాపులు ఉంటే వారిపై కఠిన చర్యలు
Updated on: 2024-05-20 14:02:00

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మే 20(పోలీస్ నిఘా):రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నవీన్ అనే యువకుడు గ్రామంలో విచ్చల వీడియో మద్యం అమ్మకాలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేశాడు.తమ గ్రామంలో బెల్ట్ షాపులు సమూలంగా నిర్ములించాలని, ఉన్న షాపులన్ని మూసేయ్యలని,గ్రామంలో 24 గంటలు బెల్ట్ షాపులు తెరచి ఉంచుతున్నారని, యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి పాలవుతున్నారు. పనులు మానేసి తాగడమే పనిగా పెట్టురుకున్నారని, గ్రామంలో బెల్ట్ షాపులు మూసివేయాలని,ఈరోజు ఉదయం అబ్కారి స్టేషన్ నందు ఫిర్యాదు అందించాడు. నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసాం అని తెలిపారు. అబ్కారి అధికారి టీ.శేఖర్ మాట్లాడుతూ,, ఫరక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నిన్న నిరసన చేసిన యువకుడు నవీన్ ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి తనిఖీలు చేయగా ఇద్దరి దగ్గర మద్యం లభించినట్టు తెలిపారు. ఇద్దరు పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరికొందరి ఇండ్లలో సోదాలు చేయగా ఎలాంటి మద్యం లభించలేదు. గ్రామంలో గతంలో మద్యం అమ్మిన వారిని మరియు ఇప్పుడు దొరికిన వారిని స్టేషన్ పిలిపించి మాట్లాడడం జరిగిందన్నారు. కేసు నమోదైన వారిని ఈరోజు తాసిల్దార్ దగ్గర హాజరు పరుస్తామని తెలిపారు. తాలుకలో ఏ గ్రామంలో మద్య మకాలు ఉన్న తక్షణమే అబ్కారి స్టేషన్ కు ఫిర్యాదు చేయగలరని మనవి.