ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కందివనం యువకుడి నిరసనకు స్పందించిన అధికారులు గ్రామలలో బెల్ట్ షాపులు ఉంటే వారిపై కఠిన చర్యలు
Updated on: 2024-05-20 14:02:00
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మే 20(పోలీస్ నిఘా):రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నవీన్ అనే యువకుడు గ్రామంలో విచ్చల వీడియో మద్యం అమ్మకాలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేశాడు.తమ గ్రామంలో బెల్ట్ షాపులు సమూలంగా నిర్ములించాలని, ఉన్న షాపులన్ని మూసేయ్యలని,గ్రామంలో 24 గంటలు బెల్ట్ షాపులు తెరచి ఉంచుతున్నారని, యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి పాలవుతున్నారు. పనులు మానేసి తాగడమే పనిగా పెట్టురుకున్నారని, గ్రామంలో బెల్ట్ షాపులు మూసివేయాలని,ఈరోజు ఉదయం అబ్కారి స్టేషన్ నందు ఫిర్యాదు అందించాడు. నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసాం అని తెలిపారు. అబ్కారి అధికారి టీ.శేఖర్ మాట్లాడుతూ,, ఫరక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నిన్న నిరసన చేసిన యువకుడు నవీన్ ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి తనిఖీలు చేయగా ఇద్దరి దగ్గర మద్యం లభించినట్టు తెలిపారు. ఇద్దరు పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరికొందరి ఇండ్లలో సోదాలు చేయగా ఎలాంటి మద్యం లభించలేదు. గ్రామంలో గతంలో మద్యం అమ్మిన వారిని మరియు ఇప్పుడు దొరికిన వారిని స్టేషన్ పిలిపించి మాట్లాడడం జరిగిందన్నారు. కేసు నమోదైన వారిని ఈరోజు తాసిల్దార్ దగ్గర హాజరు పరుస్తామని తెలిపారు. తాలుకలో ఏ గ్రామంలో మద్య మకాలు ఉన్న తక్షణమే అబ్కారి స్టేషన్ కు ఫిర్యాదు చేయగలరని మనవి.