ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
మూడు కిలోమీటర్ల మేర తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Updated on: 2024-05-19 21:32:00

తిరుపతి:తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధికిఈరోజు ఉదయం నుండి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు.మరో కొన్ని రోజుల్లో పాఠ శాలలు,కళాశాలలు ప్రారం భం కానున్న నేపథ్యంలో సెలవుల్లోనే భక్తులు తమ పిల్లలతో తిరుమలకు పోటెత్తుతున్నారు.ఈ నేపథ్యంలో శ్రీవారి సన్ని ధిలో రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు,కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్,నారాయణగిరి షెడ్లు,నిండిపోయాయి..తిరుమలలో రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలో మీటర్ల వరకు బారులు దీరారు.శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.క్యూలైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు,అన్నప్రసాదాలు,పాలు అందిస్తున్నట్లు చెప్పారు.టీటీడీ జేఈవో వీరబ్రహ్మం,డిప్యూటీ ఈవో హరీంద్ర నాథ్,తితిదే భద్రతాధికా రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటు న్నారు.వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.