ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
మూడు కిలోమీటర్ల మేర తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Updated on: 2024-05-19 21:32:00

తిరుపతి:తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధికిఈరోజు ఉదయం నుండి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు.మరో కొన్ని రోజుల్లో పాఠ శాలలు,కళాశాలలు ప్రారం భం కానున్న నేపథ్యంలో సెలవుల్లోనే భక్తులు తమ పిల్లలతో తిరుమలకు పోటెత్తుతున్నారు.ఈ నేపథ్యంలో శ్రీవారి సన్ని ధిలో రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు,కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్,నారాయణగిరి షెడ్లు,నిండిపోయాయి..తిరుమలలో రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలో మీటర్ల వరకు బారులు దీరారు.శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.క్యూలైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు,అన్నప్రసాదాలు,పాలు అందిస్తున్నట్లు చెప్పారు.టీటీడీ జేఈవో వీరబ్రహ్మం,డిప్యూటీ ఈవో హరీంద్ర నాథ్,తితిదే భద్రతాధికా రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటు న్నారు.వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.