ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి
Updated on: 2024-05-18 17:34:00
పార్వతీపురం- సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించిన విధంగానే ఈ వి ఎమ్ ల ఓట్ల లెక్కింపు నకు అవసరమైన ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.ఉద్యాన కళాశాలలోని మూడంచెల భద్రత, ఓట్ల లెక్కింపు కొరకు కల్పించవలసిన భద్రత, వసతుల ఏర్పాట్లను ఎస్ పి విక్రాంత్ పాటిల్ తో కలసి శనివారం పరిశీలించారు. అధిక సంఖ్యలో లెక్కింపు కేంద్రం బయట జనాలు చేరుకొనే అవకాశం ఉన్నందున భారీ వాహనాలను అనుమతించకుండా దారి మళ్లించేందుకు సూచనలు చేశారు. ఎంట్రన్స్ మార్గం దగ్గర గుర్తింపు కార్డులు కలిగిన సాధారన ఏజెంట్లను మాత్రమే అనుమతించేలా పోలీస్ సిబ్బంది నియామకం, బారికేడ్లను ఏర్పాటు అంశాలపై కలెక్టర్, ఎస్ పి చర్చించారు. ఈ వి ఎమ్ ల స్ట్రాంగ్ రూమ్ భద్రతను పరిశీలించిన అనంతరం, లెక్కింపు కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలను తీసుకోవాలని అధికారులను సూచించారు. పార్లమెంట్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు గదులను సిద్ధం చేసి నివేదిక అందజేయాలని ఇన్చార్జి డి అర్ ఓ కేశవ నాయుడును ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నుంచి స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పోలీస్ పహారాను పర్యవేక్షించారు. జూన్ 4 ప తేదీ లెక్కింపు ముందు రోజు కౌంటింగ్ కేంద్రం సమీపంలోని గ్రామ ప్రజలు బయట ప్రాంతవాసులకు ఆశ్రయం కల్పించ వద్దని గ్రామాల్లో దండోరా వేయించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డా ఓ.దిలీప్ కిరణ్, కంట్రోల్ రూమ్ ఓ ఎస్ డి ఆర్.వి.సూర్యనారాయణ, పార్వతీపురం అసెంబ్లీ నియోజక రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ కె.హేమలత, దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పి, పాలకొండ డిఎస్పీ ఎస్.అర్. హర్షిత, జి.వి. కృష్ణా రావు, పోలీస్ భద్రతా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.