ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
నేలటూరులో అంగరంగ వైభవంగా దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు
Updated on: 2024-05-17 10:19:00
నేలటూరులో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు అన్నదానం మద్దిపాడు మే 16 మద్దిపాడు మండలం నేలటూరు గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా గురవయ్య గారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.గ్రామస్తులు దత్తాత్రేయ దీక్ష చేపట్టి గ్రామాన్ని ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తున్నారు గత 15 సంవత్సరాల నుండి నేలటూరు గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలను గురవయ్య స్వామి ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి మాలలు ధరించి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.మాల ధరించిన స్వాములు గ్రామస్తుల సహాయ సహకారాలతో దత్తాత్రేయ స్వామి మాల మాలదారులు ఉత్సవాలను వైభవ్పేతంగా నిర్వహిస్తున్నారు. విద్యుత్ కాంతులతో ఆలయాన్ని ముస్తాబు చేశారు చిన్న పెద్ద తేడా లేకుండా దత్తాత్రేయ స్వామి మాలలు ధరించి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఆ గ్రామం ఆధ్యాత్మికత సంతరించుకుంది.మహిళల సైతం ఆలయం వద్ద సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి దత్తాత్రేయ స్వామి ఉత్సవాల్లో ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తూ గ్రామస్తులను కూడా అబ్బురు పరుస్తున్నారు. నేలటూరుకు చెందిన గురవయ్య గురు స్వామి వ్యవసాయమే ప్రధాన వృత్తి కావడం ఆలయ సహాయ సహకారాలు మెండుగా అందుతున్నాయి.గ్రామస్తులకు తలలో నాలుకల ఉంటూ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దినది నాది అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.అనంతరం గ్రామస్తులకు అన్నదానం నిర్వహించి గురువయ్య గురుస్వామి తో పాటు మాల ధరించిన ప్రతి ఒక్కరిని మహిళల సహకారాన్నిగ్రామస్తుల అభినందిస్తున్నారు. దత్తాత్రేయ స్వామి కలిశాలను నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామంలో వెలిసియున్న దత్తాత్రేయ స్వామి అభిషేకాలకు నేలటూరు నుండి గురవ గురుస్వామి తోపాటు మాల ధరించిన ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కలశాలను తీసుకువెళ్తారు. మొగిలిచర్లలో దత్తాత్రేయ స్వామి అభిషేకాలనుచేయిస్తారు.