ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
నేలటూరులో అంగరంగ వైభవంగా దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు
Updated on: 2024-05-17 10:19:00
నేలటూరులో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు అన్నదానం మద్దిపాడు మే 16 మద్దిపాడు మండలం నేలటూరు గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా గురవయ్య గారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.గ్రామస్తులు దత్తాత్రేయ దీక్ష చేపట్టి గ్రామాన్ని ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తున్నారు గత 15 సంవత్సరాల నుండి నేలటూరు గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలను గురవయ్య స్వామి ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి మాలలు ధరించి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.మాల ధరించిన స్వాములు గ్రామస్తుల సహాయ సహకారాలతో దత్తాత్రేయ స్వామి మాల మాలదారులు ఉత్సవాలను వైభవ్పేతంగా నిర్వహిస్తున్నారు. విద్యుత్ కాంతులతో ఆలయాన్ని ముస్తాబు చేశారు చిన్న పెద్ద తేడా లేకుండా దత్తాత్రేయ స్వామి మాలలు ధరించి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఆ గ్రామం ఆధ్యాత్మికత సంతరించుకుంది.మహిళల సైతం ఆలయం వద్ద సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి దత్తాత్రేయ స్వామి ఉత్సవాల్లో ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తూ గ్రామస్తులను కూడా అబ్బురు పరుస్తున్నారు. నేలటూరుకు చెందిన గురవయ్య గురు స్వామి వ్యవసాయమే ప్రధాన వృత్తి కావడం ఆలయ సహాయ సహకారాలు మెండుగా అందుతున్నాయి.గ్రామస్తులకు తలలో నాలుకల ఉంటూ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దినది నాది అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.అనంతరం గ్రామస్తులకు అన్నదానం నిర్వహించి గురువయ్య గురుస్వామి తో పాటు మాల ధరించిన ప్రతి ఒక్కరిని మహిళల సహకారాన్నిగ్రామస్తుల అభినందిస్తున్నారు. దత్తాత్రేయ స్వామి కలిశాలను నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామంలో వెలిసియున్న దత్తాత్రేయ స్వామి అభిషేకాలకు నేలటూరు నుండి గురవ గురుస్వామి తోపాటు మాల ధరించిన ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కలశాలను తీసుకువెళ్తారు. మొగిలిచర్లలో దత్తాత్రేయ స్వామి అభిషేకాలనుచేయిస్తారు.