ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
నేలటూరులో అంగరంగ వైభవంగా దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు
Updated on: 2024-05-17 10:19:00

నేలటూరులో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు అన్నదానం మద్దిపాడు మే 16 మద్దిపాడు మండలం నేలటూరు గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా గురవయ్య గారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.గ్రామస్తులు దత్తాత్రేయ దీక్ష చేపట్టి గ్రామాన్ని ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తున్నారు గత 15 సంవత్సరాల నుండి నేలటూరు గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలను గురవయ్య స్వామి ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి మాలలు ధరించి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.మాల ధరించిన స్వాములు గ్రామస్తుల సహాయ సహకారాలతో దత్తాత్రేయ స్వామి మాల మాలదారులు ఉత్సవాలను వైభవ్పేతంగా నిర్వహిస్తున్నారు. విద్యుత్ కాంతులతో ఆలయాన్ని ముస్తాబు చేశారు చిన్న పెద్ద తేడా లేకుండా దత్తాత్రేయ స్వామి మాలలు ధరించి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఆ గ్రామం ఆధ్యాత్మికత సంతరించుకుంది.మహిళల సైతం ఆలయం వద్ద సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి దత్తాత్రేయ స్వామి ఉత్సవాల్లో ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తూ గ్రామస్తులను కూడా అబ్బురు పరుస్తున్నారు. నేలటూరుకు చెందిన గురవయ్య గురు స్వామి వ్యవసాయమే ప్రధాన వృత్తి కావడం ఆలయ సహాయ సహకారాలు మెండుగా అందుతున్నాయి.గ్రామస్తులకు తలలో నాలుకల ఉంటూ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దినది నాది అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.అనంతరం గ్రామస్తులకు అన్నదానం నిర్వహించి గురువయ్య గురుస్వామి తో పాటు మాల ధరించిన ప్రతి ఒక్కరిని మహిళల సహకారాన్నిగ్రామస్తుల అభినందిస్తున్నారు. దత్తాత్రేయ స్వామి కలిశాలను నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామంలో వెలిసియున్న దత్తాత్రేయ స్వామి అభిషేకాలకు నేలటూరు నుండి గురవ గురుస్వామి తోపాటు మాల ధరించిన ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కలశాలను తీసుకువెళ్తారు. మొగిలిచర్లలో దత్తాత్రేయ స్వామి అభిషేకాలనుచేయిస్తారు.