ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఓడిపోతామన్న అసూయతోనే వైసీపీ గుండాల దాడులు: సత్యకుమార్ యాదవ్
Updated on: 2024-05-15 07:01:00

కేతిరెడ్డి దౌర్జన్యాలకు ముగింపు పలకడానికే నేను వచ్చా * వైసీపీ రౌడీల దాడిలో గాయపడిన ప్రజలను పరామర్శించిన సత్యకుమార్ యాదవ్ ఎన్నికల్లో ప్రజలు కేతిరెడ్డికి వ్యతిరేకంగా ఓటేయడంతో తన ఓటమిని జీర్ణించుకోలేక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాడని ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఓబుల నాయన పల్లి, చిన్నూరు బత్తలపల్లి గ్రామస్తులపై మంగళవారం వైసీపీ గుండాలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. ధర్మవరంలో కేతిరెడ్డి రౌడీయిజానికి పతనం ప్రారంభమైందని, ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ధర్మవరంలో తన అధ్యాయం ముగుస్తుందని తెలుసుకున్న కేతిరెడ్డి ఇలా ప్రజలపై దాడులు చేయిస్తూ తన అక్కసును వెళ్లగక్కుతున్నాడని చెప్పారు. ధర్మవరం వాసులు ఎవరు ఇకమీదట భయపడాల్సిన అవసరం లేదని, కేతిరెడ్డి రౌడీ రాజ్యానికి ముగింపు పలకడానికే తాను ఇక్కడికి వచ్చానని, అధికారంలోకి రాగానే కేతిరెడ్డి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెడతానన్నారు. వైసిపి గూండాలకు గడ్డుకాలం రాబోతోందని, ప్రజల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని చెప్పారు.