ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఓడిపోతామన్న అసూయతోనే వైసీపీ గుండాల దాడులు: సత్యకుమార్ యాదవ్
Updated on: 2024-05-15 07:01:00
కేతిరెడ్డి దౌర్జన్యాలకు ముగింపు పలకడానికే నేను వచ్చా * వైసీపీ రౌడీల దాడిలో గాయపడిన ప్రజలను పరామర్శించిన సత్యకుమార్ యాదవ్ ఎన్నికల్లో ప్రజలు కేతిరెడ్డికి వ్యతిరేకంగా ఓటేయడంతో తన ఓటమిని జీర్ణించుకోలేక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాడని ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఓబుల నాయన పల్లి, చిన్నూరు బత్తలపల్లి గ్రామస్తులపై మంగళవారం వైసీపీ గుండాలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. ధర్మవరంలో కేతిరెడ్డి రౌడీయిజానికి పతనం ప్రారంభమైందని, ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ధర్మవరంలో తన అధ్యాయం ముగుస్తుందని తెలుసుకున్న కేతిరెడ్డి ఇలా ప్రజలపై దాడులు చేయిస్తూ తన అక్కసును వెళ్లగక్కుతున్నాడని చెప్పారు. ధర్మవరం వాసులు ఎవరు ఇకమీదట భయపడాల్సిన అవసరం లేదని, కేతిరెడ్డి రౌడీ రాజ్యానికి ముగింపు పలకడానికే తాను ఇక్కడికి వచ్చానని, అధికారంలోకి రాగానే కేతిరెడ్డి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెడతానన్నారు. వైసిపి గూండాలకు గడ్డుకాలం రాబోతోందని, ప్రజల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని చెప్పారు.