ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఓడిపోతామన్న అసూయతోనే వైసీపీ గుండాల దాడులు: సత్యకుమార్ యాదవ్
Updated on: 2024-05-15 07:01:00

కేతిరెడ్డి దౌర్జన్యాలకు ముగింపు పలకడానికే నేను వచ్చా * వైసీపీ రౌడీల దాడిలో గాయపడిన ప్రజలను పరామర్శించిన సత్యకుమార్ యాదవ్ ఎన్నికల్లో ప్రజలు కేతిరెడ్డికి వ్యతిరేకంగా ఓటేయడంతో తన ఓటమిని జీర్ణించుకోలేక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాడని ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఓబుల నాయన పల్లి, చిన్నూరు బత్తలపల్లి గ్రామస్తులపై మంగళవారం వైసీపీ గుండాలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. ధర్మవరంలో కేతిరెడ్డి రౌడీయిజానికి పతనం ప్రారంభమైందని, ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ధర్మవరంలో తన అధ్యాయం ముగుస్తుందని తెలుసుకున్న కేతిరెడ్డి ఇలా ప్రజలపై దాడులు చేయిస్తూ తన అక్కసును వెళ్లగక్కుతున్నాడని చెప్పారు. ధర్మవరం వాసులు ఎవరు ఇకమీదట భయపడాల్సిన అవసరం లేదని, కేతిరెడ్డి రౌడీ రాజ్యానికి ముగింపు పలకడానికే తాను ఇక్కడికి వచ్చానని, అధికారంలోకి రాగానే కేతిరెడ్డి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెడతానన్నారు. వైసిపి గూండాలకు గడ్డుకాలం రాబోతోందని, ప్రజల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని చెప్పారు.