ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు..
Updated on: 2024-05-15 06:45:00
సగర భగీరథ మహర్షి మహా జ్ఞాని,పరోపకారానికి పెట్టింది పేరు అని, దీక్షకు, సహనానికి ప్రతిరూపం అని, ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించాడని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ అన్నాడు.. సగర భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి, బిసి కుల సంఘ పెద్దలు, నాయకుల సమక్షంలో ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరిగింది.. ఎవరైనా కఠోర శ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటామని , దానికి ప్రత్యక్ష దైవంగా భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడనీ శ్రీనివాస్ సాగర్ కొనియాడారు.. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సవారి సత్యం,దేవరకద్ర బీసీ సమాజ్ నియోజక వర్గ కన్వీనర్ శేఖర్, జండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్, రజక రిజర్వేషన్ జాతీయ అధ్యక్షుడు నడిమింటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ డికె నాయి, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, ముదిరాజ్ సంఘం నాయకులు గంజి ఆంజనేయులు, రజక రిజర్వేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు శివన్న, బీసీ సమాజ్ సభ్యులు సుక్కలి భాస్కర్, మల్లేష్, కోళ్ల రాజు, ఆంజనేయులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు