ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కౌన్సిలర్ సర్వర్ పాషా
Updated on: 2024-05-08 06:32:00
బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్..! బీఆర్ఎస్ పట్టణ సెక్రెటరీ వన్నాడ వెంకటేష్ గౌడ్ అదే దారి షాద్ నగర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ సర్వర్ పాషా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పట్టణ బీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ వన్నాడ వెంకటేష్ గౌడ్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సెక్యులరిజమే ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకు మానవతావాదులు దూరంగా ఉంటారని అన్నారు. వంశీ చంద్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం సీనియర్ నాయకుడు డంగు శ్రీనివాస్ యాదవ్, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మైనార్టీ నేత జమ్రుత్ ఖాన్, గిరిజన నేత శీను నాయక్ ప్రకాష్, అగ్గనూరు బసవమప్ప, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.