ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కౌన్సిలర్ సర్వర్ పాషా
Updated on: 2024-05-08 06:32:00

బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్..! బీఆర్ఎస్ పట్టణ సెక్రెటరీ వన్నాడ వెంకటేష్ గౌడ్ అదే దారి షాద్ నగర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ సర్వర్ పాషా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పట్టణ బీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ వన్నాడ వెంకటేష్ గౌడ్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సెక్యులరిజమే ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకు మానవతావాదులు దూరంగా ఉంటారని అన్నారు. వంశీ చంద్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం సీనియర్ నాయకుడు డంగు శ్రీనివాస్ యాదవ్, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మైనార్టీ నేత జమ్రుత్ ఖాన్, గిరిజన నేత శీను నాయక్ ప్రకాష్, అగ్గనూరు బసవమప్ప, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.