ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కౌన్సిలర్ సర్వర్ పాషా
Updated on: 2024-05-08 06:32:00
బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్..! బీఆర్ఎస్ పట్టణ సెక్రెటరీ వన్నాడ వెంకటేష్ గౌడ్ అదే దారి షాద్ నగర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ సర్వర్ పాషా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పట్టణ బీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ వన్నాడ వెంకటేష్ గౌడ్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సెక్యులరిజమే ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకు మానవతావాదులు దూరంగా ఉంటారని అన్నారు. వంశీ చంద్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం సీనియర్ నాయకుడు డంగు శ్రీనివాస్ యాదవ్, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మైనార్టీ నేత జమ్రుత్ ఖాన్, గిరిజన నేత శీను నాయక్ ప్రకాష్, అగ్గనూరు బసవమప్ప, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.