ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
దళితులపై వైసీపీ చిన్నచూపు : పులివర్తి నాని
Updated on: 2024-05-07 20:44:00

టీడీపీలో చేరిన దళిత నేత పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పులివర్తి నాని. వైసీపీ ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపు చూస్తోందని తిరుపతి రూరల్ మండలం, శ్రీనివాసపురంకు చెందిన వైసీపీ దళిత నేత పవన్ కళ్యాణ్ (బిట్టు) ఆరోపించారు. మంగళవారం ఆయనతో పాటు ఎంపీటీసీ లావణ్య, శేఖర్ రెడ్డి ,గజేంద్ర, అమరేష్, జాను తదితరులు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పులివర్తి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. వైసీపీ పాలనలో దళితులకు స్వేచ్ఛ కరువైందన్నారు. దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి దగా చేసిందన్నారు. దళితులు అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించాలంటే చంద్రబాబు సీఎం కావాలని, పులివర్తి నాని ఎమ్మెల్యే కావాలని చెప్పారు. ప్రతిఒకరు రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని ఆయన కోరారు.