ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
దళితులపై వైసీపీ చిన్నచూపు : పులివర్తి నాని
Updated on: 2024-05-07 20:44:00

టీడీపీలో చేరిన దళిత నేత పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పులివర్తి నాని. వైసీపీ ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపు చూస్తోందని తిరుపతి రూరల్ మండలం, శ్రీనివాసపురంకు చెందిన వైసీపీ దళిత నేత పవన్ కళ్యాణ్ (బిట్టు) ఆరోపించారు. మంగళవారం ఆయనతో పాటు ఎంపీటీసీ లావణ్య, శేఖర్ రెడ్డి ,గజేంద్ర, అమరేష్, జాను తదితరులు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పులివర్తి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. వైసీపీ పాలనలో దళితులకు స్వేచ్ఛ కరువైందన్నారు. దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి దగా చేసిందన్నారు. దళితులు అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించాలంటే చంద్రబాబు సీఎం కావాలని, పులివర్తి నాని ఎమ్మెల్యే కావాలని చెప్పారు. ప్రతిఒకరు రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని ఆయన కోరారు.