ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
భర్త గెలుపు కోసం భార్య , కుమార్తె ప్రచారం.
Updated on: 2024-05-06 16:04:00

కూటమి ఉమ్మడి అభ్యర్థి ,బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ను గెలిపించాలని ఆయన సతీమణి త్రివేణి తన కుమార్తె సంస్కృతి తో కలిసి ఈ రోజు బత్తలపల్లి లో ప్రచారం నిర్వహించారు.ఎన్నికల తేదీ సమీస్తున్న తరుణంలో వారు ప్రచార వేగాన్ని పెంచారు.ధర్మవరంలో అన్ని మున్సిపల్ వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బత్తలపల్లి లో ని ఎంపికచేసిన ప్రాంతాల్లో ఈ రోజు త్రివేణి ప్రచారంలో పాల్గొన్నారు.అమ్మలక్కలను కలిసి సత్యకుమార్ ను గెలిపించాలని కోరారు.ఆయా ప్రాంతాల్లో మహిళలు ఘన స్వాగతం పలికారు. కొన్ని ప్రాంతాల్లో హారతులు ఇచ్చి మరి స్వాగతించారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారాన్ని సాగించారు. మహిళలతో కలిసినపుడు ఓటు బిజెపి కే వేస్తామని హామి ఇచ్చారు.అదే సమయంలో అటుగా వచ్చిన పిల్లలతో త్రివేణి ముచ్చటించారు. అనంతరం గోశాలను సందర్శించి గోవులకు గ్రాసం అందించారు.పెద్దవారికి నమస్కరిస్తూ ,పిల్లలను పలకరిస్తూ వారు ప్రచారం నిర్వహించారు.చివరిగా అనంతపురం రోడ్డులోని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బత్తలపల్లి ఇన్ చార్జి లలిత్ ,కోటి బాబు ,శేషయ్య , సీనియర్ టిడిపి నేత అయ్యప్ప,రాజా రెడ్డి, మల్లేశ్ యాదవ్ ,ములగూరి ప్రసాద్ నాయుడు ,సురేంద్ర నాయుడు, శ్రీమతి అరుణా రవి తదితరులు పాల్గొన్నారు.