ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
భర్త గెలుపు కోసం భార్య , కుమార్తె ప్రచారం.
Updated on: 2024-05-06 16:04:00

కూటమి ఉమ్మడి అభ్యర్థి ,బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ను గెలిపించాలని ఆయన సతీమణి త్రివేణి తన కుమార్తె సంస్కృతి తో కలిసి ఈ రోజు బత్తలపల్లి లో ప్రచారం నిర్వహించారు.ఎన్నికల తేదీ సమీస్తున్న తరుణంలో వారు ప్రచార వేగాన్ని పెంచారు.ధర్మవరంలో అన్ని మున్సిపల్ వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బత్తలపల్లి లో ని ఎంపికచేసిన ప్రాంతాల్లో ఈ రోజు త్రివేణి ప్రచారంలో పాల్గొన్నారు.అమ్మలక్కలను కలిసి సత్యకుమార్ ను గెలిపించాలని కోరారు.ఆయా ప్రాంతాల్లో మహిళలు ఘన స్వాగతం పలికారు. కొన్ని ప్రాంతాల్లో హారతులు ఇచ్చి మరి స్వాగతించారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారాన్ని సాగించారు. మహిళలతో కలిసినపుడు ఓటు బిజెపి కే వేస్తామని హామి ఇచ్చారు.అదే సమయంలో అటుగా వచ్చిన పిల్లలతో త్రివేణి ముచ్చటించారు. అనంతరం గోశాలను సందర్శించి గోవులకు గ్రాసం అందించారు.పెద్దవారికి నమస్కరిస్తూ ,పిల్లలను పలకరిస్తూ వారు ప్రచారం నిర్వహించారు.చివరిగా అనంతపురం రోడ్డులోని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బత్తలపల్లి ఇన్ చార్జి లలిత్ ,కోటి బాబు ,శేషయ్య , సీనియర్ టిడిపి నేత అయ్యప్ప,రాజా రెడ్డి, మల్లేశ్ యాదవ్ ,ములగూరి ప్రసాద్ నాయుడు ,సురేంద్ర నాయుడు, శ్రీమతి అరుణా రవి తదితరులు పాల్గొన్నారు.