ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
భర్త గెలుపు కోసం భార్య , కుమార్తె ప్రచారం.
Updated on: 2024-05-06 16:04:00
కూటమి ఉమ్మడి అభ్యర్థి ,బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ను గెలిపించాలని ఆయన సతీమణి త్రివేణి తన కుమార్తె సంస్కృతి తో కలిసి ఈ రోజు బత్తలపల్లి లో ప్రచారం నిర్వహించారు.ఎన్నికల తేదీ సమీస్తున్న తరుణంలో వారు ప్రచార వేగాన్ని పెంచారు.ధర్మవరంలో అన్ని మున్సిపల్ వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బత్తలపల్లి లో ని ఎంపికచేసిన ప్రాంతాల్లో ఈ రోజు త్రివేణి ప్రచారంలో పాల్గొన్నారు.అమ్మలక్కలను కలిసి సత్యకుమార్ ను గెలిపించాలని కోరారు.ఆయా ప్రాంతాల్లో మహిళలు ఘన స్వాగతం పలికారు. కొన్ని ప్రాంతాల్లో హారతులు ఇచ్చి మరి స్వాగతించారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారాన్ని సాగించారు. మహిళలతో కలిసినపుడు ఓటు బిజెపి కే వేస్తామని హామి ఇచ్చారు.అదే సమయంలో అటుగా వచ్చిన పిల్లలతో త్రివేణి ముచ్చటించారు. అనంతరం గోశాలను సందర్శించి గోవులకు గ్రాసం అందించారు.పెద్దవారికి నమస్కరిస్తూ ,పిల్లలను పలకరిస్తూ వారు ప్రచారం నిర్వహించారు.చివరిగా అనంతపురం రోడ్డులోని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బత్తలపల్లి ఇన్ చార్జి లలిత్ ,కోటి బాబు ,శేషయ్య , సీనియర్ టిడిపి నేత అయ్యప్ప,రాజా రెడ్డి, మల్లేశ్ యాదవ్ ,ములగూరి ప్రసాద్ నాయుడు ,సురేంద్ర నాయుడు, శ్రీమతి అరుణా రవి తదితరులు పాల్గొన్నారు.