ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
యువకుడిపై కత్తితో దాడి - మరో యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం- పోలీసు ఔట్ పోస్టు వద్ద ఘటన
Updated on: 2024-04-22 19:17:00
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి చౌరస్తా ఔట్ పోస్టు వద్ద సోమవారం యువకుడు గంజాయి మత్తులో ఒక యువకుడిపై కత్తితో దాడీ చేయగా మరో యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు ఊపిరిపీల్చుకుంటుండగా నగరంలోని అర్సపల్లి చౌరస్తాలోని పోలీసు ఔట్ పోస్టు వద్ద గంజాయి సేవించి కత్తితో దాడికి పాల్పడ్డ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. గాయపడిన యువకుడిని ఫిరోజ్ ఖాన్ గా గుర్తించగా పొడిచిన యువకుడిని అక్రమ్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. పోలీసు ఔట్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగినప్పుడు పోలీసు సిబ్బంది ఉండగానే అక్రమ్ ఖాన్ కత్తితో ఫిరోజ్ ఖాన్ పై దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు పాతకక్ష్యలు కారణమని తెలుస్తోంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్ కలుగజేసుకుని ఫిరోజ్ ఖాన్ కు రక్షించారు. స్థానికులు ఫిరోజ్ ఖాన్ ను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. గంజాయి మత్తులో ఉన్న అక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.