ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
యువకుడిపై కత్తితో దాడి - మరో యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం- పోలీసు ఔట్ పోస్టు వద్ద ఘటన
Updated on: 2024-04-22 19:17:00

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి చౌరస్తా ఔట్ పోస్టు వద్ద సోమవారం యువకుడు గంజాయి మత్తులో ఒక యువకుడిపై కత్తితో దాడీ చేయగా మరో యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు ఊపిరిపీల్చుకుంటుండగా నగరంలోని అర్సపల్లి చౌరస్తాలోని పోలీసు ఔట్ పోస్టు వద్ద గంజాయి సేవించి కత్తితో దాడికి పాల్పడ్డ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. గాయపడిన యువకుడిని ఫిరోజ్ ఖాన్ గా గుర్తించగా పొడిచిన యువకుడిని అక్రమ్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. పోలీసు ఔట్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగినప్పుడు పోలీసు సిబ్బంది ఉండగానే అక్రమ్ ఖాన్ కత్తితో ఫిరోజ్ ఖాన్ పై దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు పాతకక్ష్యలు కారణమని తెలుస్తోంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్ కలుగజేసుకుని ఫిరోజ్ ఖాన్ కు రక్షించారు. స్థానికులు ఫిరోజ్ ఖాన్ ను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. గంజాయి మత్తులో ఉన్న అక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.