ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
కొడుకు మృతదేహంతో,8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన కన్నతండ్రి
Updated on: 2024-04-11 12:31:00

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపో వడంతో కొడుకు మృతదే హంతో తండ్రి ఏకంగా 8 కిలోమీటర్లు నడిచాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంత గిరి మండల పరిధిలోని రొంపల్లి పంచాయతీ చినకోనెలకు చెందిన సార కొత్తయ్య కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా కొల్లూరు వద్ద ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన చిన్న కుమారుడు ఈశ్వరరావు (3) సోమవారం అనారో గ్యంతో చనిపోయాడు. దాంతో మృతదేహాన్ని అంబులెన్స్లో స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేసుకు న్నారు. అయితే, అంబులెన్స్ డ్రైవర్ వారిని మంగళ వారం సాయంత్రం విజయ నగరం జిల్లా మెంటాడ మండలం వనిజ వద్ద దించేసి వెళ్లిపోయాడు. ఇక అక్కడి నుంచి గ్రామా నికి సరైన రహదారి లేకపో వడంతో మృతదేహాన్ని మోసుకుని కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది..