ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
షాద్ నగర్ లో అరుణమ్మ కు భారీ మెజారిటిని ఇద్దాం
Updated on: 2024-04-08 13:46:00
షాద్ నగర్ లో అరుణమ్మ కు భారీ మెజారిటిని ఇద్దాం ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నిన్న అధికారం రాత్రి కొత్తూరు మండలం గూడూరు, మల్లాపూర్, మల్లాపూర్ తాండ,మక్తగూడ లో బిజెపి ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈయొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈయొక్క సమావేశాన్ని ఉద్దేశించి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు,కార్యకర్తలు కలిసి జట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ కు షాద్ నగర్ నియోజకవర్గం నుండి లక్ష కు పైగా ఓట్లను ఇద్దామని బిజెపి నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కలిసి కట్టుగా సమన్వయం గా పని చేసినప్పుడే అనుకున్నది సాధిస్తామని అన్నారు. ప్రజలు మోదీ కి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కావున మనం చేయాల్సింది ఒక్కటే ఎన్నికల వరకు ప్రతి ఓటర్ ను నాలుగు అయిదు సార్లు కలవడమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో జరిగిన అవినీతిని,సైనికుల ఊచకోతలను ఉగ్రవాదం ఎలా ఉండేనో ప్రజలకు వివరిస్తూ మోదీ గారు చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి గడప కు తీసుకెళ్లాలని కోరారు. ఈయొక్క కార్యక్రమం లో బిజెపి నాయకులు అత్తాపురం మహేందర్ రెడ్డి, శివలింగం, ఉప్పల రాఘవేందర్, జైపాల్ రెడ్డి, కంచి శేఖర్, గట్టు హరికృష్ణ,డాక్టర్ నర్సింహా నాయక్,విక్రాంత్ గౌడ్, శేఖర్ గౌడ్, వరుణ్ గౌడ్, విక్రమ్ రెడ్డి, రాఘవేంద్ర చారి, శివ దాస్, బాస్కర్ నాయక్, గుండు సాయి, వసంత్, జగదీష్, ఆనంద్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.