ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది.మాజీ మంత్రి హరీష్ రావు
Updated on: 2024-04-05 21:35:00
కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది. అదే క్రమంలో ఉపాధ్యాయులను, ఉద్యోగులను కూడా వంచించింది. కాంగ్రెస్ ఉద్యోగులకు 4 డీఏలు బకాయి పడింది. డీఏపై నిర్ణయం తీసుకుంటామని రివ్యూ మీటింగ్ పెట్టి మోసం చేసింది. ఇప్పుడు రిటైర్ అవుతున్న ఉద్యోగుల బెనిఫిట్స్ కూడా ఇప్పుడు కాకుండా, మూడేళ్ల తర్వాత ఇస్తామని లీకులు వదులుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగులపై ఏసీబీ విజిలెన్స్ దాడులతో వేధింపులకు పాల్పడుతున్నది. గతంలో కేసీఆర్ గారు 73 శాతం పీఆర్సీ అందించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పీఆర్సీ అందించాలి. ఈ దిశగా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. గొల్ల కురుమలకు 100 రోజుల్లో గొర్రెలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తర్వాత స్పందించలేదు. ఒకరోజు కూడా రివ్యూ చేయలేదు. కనీసం కట్టిన డీడీలను కాడా వాపస్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలి. స్వతంత్ర భారతంలో మొదటిసారి ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని తొలి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వక్ఫ్ బోర్డుకు జ్యూడిషల్ పవర్ ఇస్తామని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇమామ్లకు వేతనాలు అందడం లేదు. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండగలకు గత ప్రభుత్వం పేదలకు బట్టలు పంపిణీ చేసేది. కాంగ్రెస్ ఈ రంజన్ పండగకు ముస్లింలకు తోఫా బంద్ చేసింది. ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు తక్షణమే 3 డీఏలు విడుదల చేయాలి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వ.. తన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం బాధాకరం. కొంత మంది ఉద్యోగులకు మాత్రమే నెల మొదటి వారంలో జీతం ఇచ్చి అందరికీ ఇస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మొదటి తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.