ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
జగిత్యాల జిల్లాలో సర్పంచ్ భర్త ఆగడాలు.పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్యదర్శి.
Updated on: 2023-06-01 17:32:00
చిన్న పదవి ఉంటే వారి ఆగడాలకు అడ్డు.. అదుపూ లేకుండా పోతున్నాయి. ఇక అధికార పార్టీ అయితే సరే సరి.. తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ సర్పంచ్ భర్త .. ప్రభుత్వ అధికారులపై నోరు పారేసుకొని బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ అధికార పార్టీ సర్పంచ్ ఆగడాలు మితిమీరాయి. పంచాయతీ కార్యదర్శిని సర్పంచ్ భర్త రమేష్ బంధించారు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీర్పూర్ పంచాయతీ కార్యదర్శి సతీష్ విధులకు సర్పంచ్ భర్త పదే పదే అంతరాయం కలిగిస్తున్నాడు. తాను చెప్పిన విధంగా చేయడం లేదని సర్పంచ్ భర్త రమేష్ కార్యదర్శి సతీష్ ను ప్రతిరోజు అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తిడుతూ చంపుతానని బెదిరించి గదిలో బంధించాడు. ఈ విషయం ఎంపీడీవోకు తెలియడంతో బందీ గా ఉన్న సతీష్ ను బయటకు తీసుకొచ్చాడు. సర్పంచ్ భర్త రమేష్ తన విధులకు తరచు ఆటంకం కలిగిస్తూ.. బెదిరిస్తున్నాడని బీర్పూర్ పంచాయతి కార్యదర్శి సతీష్ జగిత్యాల రూరల్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ శిల్ప, భర్త రమేష్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ అరిఫ్ అలిఖాన్ తెలిపారు......