ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
జగిత్యాల జిల్లాలో సర్పంచ్ భర్త ఆగడాలు.పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్యదర్శి.
Updated on: 2023-06-01 17:32:00
చిన్న పదవి ఉంటే వారి ఆగడాలకు అడ్డు.. అదుపూ లేకుండా పోతున్నాయి. ఇక అధికార పార్టీ అయితే సరే సరి.. తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ సర్పంచ్ భర్త .. ప్రభుత్వ అధికారులపై నోరు పారేసుకొని బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ అధికార పార్టీ సర్పంచ్ ఆగడాలు మితిమీరాయి. పంచాయతీ కార్యదర్శిని సర్పంచ్ భర్త రమేష్ బంధించారు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీర్పూర్ పంచాయతీ కార్యదర్శి సతీష్ విధులకు సర్పంచ్ భర్త పదే పదే అంతరాయం కలిగిస్తున్నాడు. తాను చెప్పిన విధంగా చేయడం లేదని సర్పంచ్ భర్త రమేష్ కార్యదర్శి సతీష్ ను ప్రతిరోజు అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తిడుతూ చంపుతానని బెదిరించి గదిలో బంధించాడు. ఈ విషయం ఎంపీడీవోకు తెలియడంతో బందీ గా ఉన్న సతీష్ ను బయటకు తీసుకొచ్చాడు. సర్పంచ్ భర్త రమేష్ తన విధులకు తరచు ఆటంకం కలిగిస్తూ.. బెదిరిస్తున్నాడని బీర్పూర్ పంచాయతి కార్యదర్శి సతీష్ జగిత్యాల రూరల్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ శిల్ప, భర్త రమేష్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ అరిఫ్ అలిఖాన్ తెలిపారు......