ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సాలూరు: రెండో సారి తలపడుతున్న రాజన్నదొర సంధ్యారాణి.
Updated on: 2024-03-16 21:35:00
సాలూరు: సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, ప్రధాన పార్టీల అభ్యర్థులెవరో తేలిపోవడంతో నియోజకవర్గం లో ఎన్నికల వేడి రాజుకుంది.టిడిపి అభ్యర్థిగా సంధ్యారాణి ని ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది.సంధ్యారాణి మొదటి సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా 1999 ఎన్నికల్లో పోటీ చేశారు.అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి ఎల్ ఎన్ సన్యాసి రాజు చేతిలో ఓడిపోయారు.2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాజన్నదొర చేతిలో ఓటమి పాలయ్యారు.ఇప్పుడు మళ్ళీ టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.ఆమె 2014 ఎన్నికల్లో అరుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంధ్యారాణి విద్యావంతురాలు, మాటకారి.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆమెకు టిడిపి అధిస్థానం ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చింది.ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఇంతవరకు గెలిచిన సందర్భాలు లేవు.2024 ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.