ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
సాలూరు: రెండో సారి తలపడుతున్న రాజన్నదొర సంధ్యారాణి.
Updated on: 2024-03-16 21:35:00

సాలూరు: సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, ప్రధాన పార్టీల అభ్యర్థులెవరో తేలిపోవడంతో నియోజకవర్గం లో ఎన్నికల వేడి రాజుకుంది.టిడిపి అభ్యర్థిగా సంధ్యారాణి ని ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది.సంధ్యారాణి మొదటి సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా 1999 ఎన్నికల్లో పోటీ చేశారు.అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి ఎల్ ఎన్ సన్యాసి రాజు చేతిలో ఓడిపోయారు.2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాజన్నదొర చేతిలో ఓటమి పాలయ్యారు.ఇప్పుడు మళ్ళీ టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.ఆమె 2014 ఎన్నికల్లో అరుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంధ్యారాణి విద్యావంతురాలు, మాటకారి.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆమెకు టిడిపి అధిస్థానం ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చింది.ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఇంతవరకు గెలిచిన సందర్భాలు లేవు.2024 ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.