ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
అవసరమైన నిధులను జిల్లా బ్యాంకు నుండి అందిస్తాం
Updated on: 2024-03-14 14:29:00

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని గురువారం ప్రారంభించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పిఎసిఎస్ కొనుగోలు కార్యాలయాన్ని జాతీయ సహాకార బ్యాంకుల సమైక్య, తెలంగాణ రాష్ట్ర అపెక్స్ బ్యాంకు, కెడిసిసి బ్యాంక్ కరీంనగర్ అధ్యక్షులు కొండూరు రవీందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం లాభాల్లో ఉన్నందున పని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సంఘం గూడూరు స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను జిల్లా సహకార బ్యాంకు ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు రమేష్ బాబు, సత్యనారాయణ రావు, రాజేశ్వరరావు, సురేందర్, శ్రీనివాస్, హెడ్వర్డ్, చోటమియా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.