ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
వేసవిలో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్
Updated on: 2024-03-12 19:19:00
వేసవిలో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం గద్వాల్ పరిధిలోని గోనుపాడు గ్రామంలో మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరాను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేసవిలో త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. నీరు వృధా కాకుండా చూడాలని, ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని సూచించారు. లీకేజీలు లేకుండా చూసుకోవాలని, తెలిపారు. ఈ సందర్భంగా త్రాగు నీరు, బల్క్ వాటర్ సౌలభ్యత, నీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయితి కార్యాలయంలో నీటి సరఫరాకు సంబంధించిన ఏడు రిజిస్టర్లను, క్లోరోస్కోప్ ద్వారా నీటి స్వచ్ఛతను పరిశీలించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.