ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలను మార్చండి
Updated on: 2024-03-12 04:36:00
కరెంటు తీగలు తెగి పడటం వల్ల పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు సోమవారం విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు తుప్పు పట్టడంతో కాలం చెల్లిపోయాయని, విద్యుత్ తీగలు తెగడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ శాశ్వత పరిష్కారం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కూడా విద్యుత్ తీగల తెగి కట్టెలపై పడటంతో భారీ ఎత్తున మంటలు చేరడానికి స్థానికంగా ఇబ్బందులు పడినట్లు గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నపాటి గాలి వానలకు తెగిపడితే ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై గ్రామ సభలో కూడా వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కాలం చెల్లిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.