ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలను మార్చండి
Updated on: 2024-03-12 04:36:00
కరెంటు తీగలు తెగి పడటం వల్ల పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు సోమవారం విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు తుప్పు పట్టడంతో కాలం చెల్లిపోయాయని, విద్యుత్ తీగలు తెగడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ శాశ్వత పరిష్కారం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కూడా విద్యుత్ తీగల తెగి కట్టెలపై పడటంతో భారీ ఎత్తున మంటలు చేరడానికి స్థానికంగా ఇబ్బందులు పడినట్లు గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నపాటి గాలి వానలకు తెగిపడితే ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై గ్రామ సభలో కూడా వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కాలం చెల్లిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.