ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలను మార్చండి
Updated on: 2024-03-12 04:36:00
కరెంటు తీగలు తెగి పడటం వల్ల పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు సోమవారం విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు తుప్పు పట్టడంతో కాలం చెల్లిపోయాయని, విద్యుత్ తీగలు తెగడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ శాశ్వత పరిష్కారం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కూడా విద్యుత్ తీగల తెగి కట్టెలపై పడటంతో భారీ ఎత్తున మంటలు చేరడానికి స్థానికంగా ఇబ్బందులు పడినట్లు గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నపాటి గాలి వానలకు తెగిపడితే ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై గ్రామ సభలో కూడా వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కాలం చెల్లిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.