ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ప్రజాపాలన అర్జీలపై నిశిత పరిశీలన
Updated on: 2024-03-06 08:00:00

మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులకు అన్యాయం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సబ్సిడీ, గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ అమలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం సమష్టిగా చేస్తున్న కృషితో అర్హులకు సంక్షేమ ఫలాలు అందబోతున్నాయన్నారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.