ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
గద్దెకు చేరిన సారలమ్మ
Updated on: 2024-02-22 08:41:00
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో మొదటి ఘట్టం ముగిసింది. సారలమ్మ నిన్న గిరిజన పూజారుల, భక్తుల కోలాహలం మధ్య రాత్రి 12: 18 నిమిషాలకు గద్దెకు చేరుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క పర్యవేక్షణ లో సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు అయ్యాక గోవిందా రాజు లు, పగిడిద్దా రాజు లతో కలిసి గద్దెకి సారాలమ్మ గద్దెకు చేరి మొక్కులు పొందుతున్నారు. రెండు గంటలు కన్నెపల్లి సారాలమ్మా గుడిలో జరిగిన పూజల అనంతరం ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెల మీదకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ లు సారాలమ్మాలకు ప్రత్యేక పూజలు చేసి కన్నెపల్లి గ్రామస్తులతో కలిసి గిరిజన సాంప్రదాయ నృత్యం చేసారు.