ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
గద్దెకు చేరిన సారలమ్మ
Updated on: 2024-02-22 08:41:00
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో మొదటి ఘట్టం ముగిసింది. సారలమ్మ నిన్న గిరిజన పూజారుల, భక్తుల కోలాహలం మధ్య రాత్రి 12: 18 నిమిషాలకు గద్దెకు చేరుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క పర్యవేక్షణ లో సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు అయ్యాక గోవిందా రాజు లు, పగిడిద్దా రాజు లతో కలిసి గద్దెకి సారాలమ్మ గద్దెకు చేరి మొక్కులు పొందుతున్నారు. రెండు గంటలు కన్నెపల్లి సారాలమ్మా గుడిలో జరిగిన పూజల అనంతరం ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెల మీదకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ లు సారాలమ్మాలకు ప్రత్యేక పూజలు చేసి కన్నెపల్లి గ్రామస్తులతో కలిసి గిరిజన సాంప్రదాయ నృత్యం చేసారు.