ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఘనంగా మేడారంలో మండే మెలిగే పండుగ
Updated on: 2024-02-14 20:33:00
ములుగు జిల్లాలోని మేడారం మహజాతరకు అంకురార్పణ జరిగింది. ఈరోజు మండమెలిగే పండుగను గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, కొండాయి లో గోవిందరాజు, పూనుగుండ్లలో పగిడిద్దరాజు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మల వనదేవతలకు దిష్టి తగలకుండా ఊరు చుట్టూ రక్షబంధనం ఏర్పాటు చేశారు. అమ్మవార్ల ఆలయం ముందు రోడ్డుకు ఇరువైపులా కర్రలు పాతి కోడి, మామిడాకులు, పండుమిరపకాయలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ జరుపుకున్నట్లు పూజారులు చేశారు. ఫిబ్రవరి 21 నుండి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మేడారం మహాజాతర జరగనుంది.