ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఘనంగా మేడారంలో మండే మెలిగే పండుగ
Updated on: 2024-02-14 20:33:00
ములుగు జిల్లాలోని మేడారం మహజాతరకు అంకురార్పణ జరిగింది. ఈరోజు మండమెలిగే పండుగను గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, కొండాయి లో గోవిందరాజు, పూనుగుండ్లలో పగిడిద్దరాజు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మల వనదేవతలకు దిష్టి తగలకుండా ఊరు చుట్టూ రక్షబంధనం ఏర్పాటు చేశారు. అమ్మవార్ల ఆలయం ముందు రోడ్డుకు ఇరువైపులా కర్రలు పాతి కోడి, మామిడాకులు, పండుమిరపకాయలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ జరుపుకున్నట్లు పూజారులు చేశారు. ఫిబ్రవరి 21 నుండి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మేడారం మహాజాతర జరగనుంది.