ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
ఘనంగా మేడారంలో మండే మెలిగే పండుగ
Updated on: 2024-02-14 20:33:00

ములుగు జిల్లాలోని మేడారం మహజాతరకు అంకురార్పణ జరిగింది. ఈరోజు మండమెలిగే పండుగను గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, కొండాయి లో గోవిందరాజు, పూనుగుండ్లలో పగిడిద్దరాజు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మల వనదేవతలకు దిష్టి తగలకుండా ఊరు చుట్టూ రక్షబంధనం ఏర్పాటు చేశారు. అమ్మవార్ల ఆలయం ముందు రోడ్డుకు ఇరువైపులా కర్రలు పాతి కోడి, మామిడాకులు, పండుమిరపకాయలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ జరుపుకున్నట్లు పూజారులు చేశారు. ఫిబ్రవరి 21 నుండి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మేడారం మహాజాతర జరగనుంది.