ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
Updated on: 2024-02-02 16:16:00
గుడివాడ శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాని,ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి దర్శన కార్యక్రమాల అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. దర్శన అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.శ్రీవారి దీవెనలు సీఎం జగన్ ఆయన కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, స్వామివారి కృపతో మంచి కోసం పనిచేసే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత ఎన్నికలకు మించి, ఫలితాలు సాధిస్తుందని ఆయన అన్నారు.