ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
Updated on: 2024-01-26 21:59:00

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ , జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ జాతీయ పతాకావిష్కరణ చేసి సిబ్బందికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26న భారతదేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని , స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారతదేశంలో పరిపాలన కొరకు అత్యంత ఆవశ్యకత కలిగిన తన సొంత రాజ్యాంగం అమలు చేయాలని నిర్ణయించుకుని, రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందన, అప్పటి నుంచి దేశం ప్రజాతంత్ర పరిపాలన కలిగిన సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందన్నారు. అనంతరం అనకాపల్లి పట్టణం, ఎన్.టి.అర్ మైదానం నందు పోలీసుల నుండి జిల్లా కలెక్టర్ , ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ గారు ఎగురవేసి, ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పోలీసు పరేడ్ ను పరిశీలించారు.