ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
వార్షిక తనిఖీలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డిఐజి
Updated on: 2023-12-26 21:23:00
అనకాపల్లి జిల్లా:విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను,సబ్ డివిజన్ కార్యాలయ్యాల్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. నేరాలను అరికట్టటలో గ్రామ/వార్డు సచివాలయ మహిళ పోలీసుల పాత్ర కీలకమని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ తెలిపారు.జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలోని అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సమాచారాన్ని డీఐజీ కి వివరించారు.డీఐజీ సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ పరిసరాలను,ఎస్.హెచ్.ఓ,రైటర్, కంప్యూటర్ గదులను,కేస్ ప్రాపర్టీ భద్రపరిచిన గదిని పరిశీలించి,కేసు ప్రాపర్టీ సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ మహిళ పోలీసుల సహాయంతో బాల్యవివాహాలను అరికట్టాలని, సైబర్ క్రైమ్స్, రోడ్డు భద్రతా నియమాలు గూర్చి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు.పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి,రౌడీలు,సస్పెక్ట్ లు,పాత నేరస్తులు ఎవరు ఉన్నారు, వారి కదలికలు గురించిన వివరాలను, స్థల వివాదాలు,కుటుంబ తగాదాలు,వర్గ విభేదాలు గురించిన సమాచారాన్ని, గతంలో ఎటువంటి నేరాలు జరిగినయి, అందులో ముద్దాయిలు ఎవరు బాధితులు ఎవరు వారి ప్రస్తుత జీవన విధానం వంటి విషయాల గురించి విపులంగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం అనకాపల్లి సబ్ డివిజన్ కార్యాలయా రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.